Virat Kohli: అయోధ్యలో కనిపించని విరాట్ కోహ్లీ.. ఆహ్వానం అందినా డుమ్మా..!
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. నిజానికి విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మకు అయోధ్య రామ మందిర ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. అందరు విరుష్క దంపతులు అయోధ్య వెళ్తారని భావించారు. కాని విరాట్, అనుష్క అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లలేదు. విరాట్ ఈ వారం ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాల్గొనేందుకు భారత జట్టులో చేరేందుకు విరాట్ కోహ్లీ హైదరాబాద్కు చేరుకున్నాడు.
అయితే అతను వ్యక్తిగత కారణాలతో సిరీస్లోని మొదటి రెండు టెస్టు మ్యాచ్ల నుంచి బ్యాట్స్మెన్ గా వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నంలలో జరగాల్సిన మొదటి రెండు టెస్టులను కోహ్లీ ఆడడని, అతని గోప్యతను గౌరవించాలని అభ్యర్థించినట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో కోహ్లీ ఎందుకు అయోధ్యకు వెళ్లలేదని సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతోన్నాయి.

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విరుష్క దంపతులు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లలేదని తెలుస్తోంది. కాగా భారత్-ఇంగ్లండ్ల మధ్య వచ్చే సిరీస్ జనవరి 25న హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత విశాఖపట్నం (ఫిబ్రవరి 2-6), రాజ్కోట్ (ఫిబ్రవరి 15-19), రాంచీ (ఫిబ్రవరి 23-27), ధర్మశాల (మార్చి 7-11)లో ఇతర మ్యాచ్లు జరగనున్నాయి. విరుష్క దంపతులు త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు.
అక్టోబర్లో అనుష్క శర్మ రెండోసారి గర్భం దాల్చారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ డిసెంబర్ 2017 లో వివాహం చేసుకున్నారు. వీరికి జనవరి 2021 లో వారి కుమార్తె వామిక జన్మించింది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications