Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Narendra Modi Stadium:అహ్మదాబాద్‌ గ్రౌండ్ భారత్‌కు శాపమా..టీమిండియాకు అంతుచిక్కని ‘శోకం’!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఖ్యాతి గడించిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత జట్టుకు ఒక అంతుచిక్కని సవాలుగా మారింది. లక్ష మందికి పైగా అభిమానుల సమక్షంలో సొంతగడ్డపై ఆడుతున్నామన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, ఈ పిచ్‌పై కీలక సమయాల్లో టీమ్ ఇండియా తడబడుతుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా ఇక్కడ జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌ల్లో భారత్ పరాజయం పాలవ్వడం వెనుక కేవలం ఆటగాళ్ల వైఫల్యమే కాకుండా, స్టేడియం వాతావరణం,పిచ్ స్వభావం కూడా జట్టును ఇబ్బంది పెడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య జరిగే ఫైనల్స్ లేదా నిర్ణయాత్మక పోరాటాల్లో ఈ మైదానం భారత్‌కు ఆశించిన స్థాయిలో కలిసి రావడం లేదు.

మర్చిపోలేని విషాదం..

ఈ స్టేడియంలో భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని విషాదం 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి తిరుగులేని ఫామ్‌లో ఉన్న రోహిత్ సేన, ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.బ్లూ కలర్ జెర్సీ ధరించి లక్షా ముప్పై వేల మంది భారత్‌కు మద్దతు తెలుపుతుంటే, ఆ నిశ్శబ్దాన్ని భరించడం భారత ఆటగాళ్లకు భారంగా మారింది.

narendra-modi-stadium-is-ahmedabad-becoming-indias-big-match-nightmare-pitch-pressure-pattern-what

టాస్ గెలిచిన జట్టుకే..

పిచ్ మందకొడిగా ఉండటం,బ్యాటర్లు పరుగుల కోసం ఇబ్బంది పడటం చివరికి ప్రపంచ కప్‌ను దూరం చేసింది. అంతకుముందు 2021లో ఇక్కడ జరిగిన టీ20 సిరీస్‌లలో కూడా ఇంగ్లండ్‌తో జరిగిన కొన్ని కీలక మ్యాచ్‌ల్లో భారత్ పరాజయాలను నమోదు చేసింది. అలాగే ఐపీఎల్ వంటి భారీ టోర్నీల ఫైనల్స్‌లోనూ ఇదే మైదానం వేదికగా జరిగినప్పుడు కొన్నిసార్లు టాస్ గెలిచిన జట్లకే విజయావకాశాలు మెండుగా ఉండటం, మంచు ప్రభావం ఆటను ప్రభావితం చేయడం వంటి అంశాలు టీమ్ ఇండియాకు ప్రతికూలంగా మారుతున్నాయి.

IND vs SA: టీమిండియా బొమ్మ తిరగబడింది!
IND vs SA: టీమిండియా బొమ్మ తిరగబడింది!

అంచనా వేయడంలో భారత్ ఫెయిల్

నరేంద్ర మోదీ స్టేడియంలోని ఎరుపు ఇంకా నలుపు మట్టి పిచ్‌లను అర్థం చేసుకోవడంలో బ్యాటర్లు తరచుగా విఫలమవుతున్నారు. ఇక్కడ బౌన్స్ నిలకడగా లేకపోవడం, స్పిన్నర్లకు అనుకూలించే సమయంలో బ్యాటింగ్ చేయడం కష్టతరంగా మారుతోంది. ఆస్ట్రేలియా వంటి జట్లు ఈ పిచ్ పరిస్థితులను చక్కగా అంచనా వేసి మనపై పైచేయి సాధించగలిగాయి.

పాకిస్తాన్ కే సెమీస్ ఛాన్స్- భారత్ ద్వారాలు మూసుకుపోయాయ్: అదొక్కటే చిట్టచివరి ఆశ
పాకిస్తాన్ కే సెమీస్ ఛాన్స్- భారత్ ద్వారాలు మూసుకుపోయాయ్: అదొక్కటే చిట్టచివరి ఆశ

ఒకవైపు ఈ స్టేడియం అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగి ఉన్నప్పటికీ, విజయాల పరంగా చూస్తే మాత్రం భారత్‌కు ఇది ఒక 'దురదృష్టకర మైదానం'గా ముద్ర వేయించుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ పిచ్ స్వభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సరైన వ్యూహాలతో బరిలోకి దిగితే తప్ప అహ్మదాబాద్ శాపాన్ని భారత్ అధిగమించడం సాధ్యం కాదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+