ఒలింపిక్స్లో ఎదురులేని భారత్: అతనే హీరో ..!!
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్.. మరో పతకానికి చేరువైంది. పురుషుల హాకీలో పతకం ముగింట్లో నిలిచింది. ఇంకొక్క విజయం సాధించగలిగితే పతకం ఖాయం. వీటితో పాటు మహిళల మిడిల్ వెయిట్ బాక్సింగ్, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పతకాలను ముద్దాడే అవకాశం ఉంది.
తాజాగా.. పురుషుల హాకీ క్వార్టర్ ఫైనల్స్లో గ్రేట్ బ్రిటన్ను మట్టికరిపించింది భారత్. పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో విజయకేతనాన్ని ఎగురవేసింది. హర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్, లలిత్, రాజ్కుమార్.. ఈ గోల్స్ సాధించారు. గ్రేట్ బ్రిటన్ రెండు గోల్స్కే పరిమితమైంది.

మ్యాచ్ ఆరంభంలో రెండు జట్లు కూడా పోటాపోటీగా ఆటతీరును ప్రదర్శించాయి. మ్యాచ్ ప్రారంభమైన 22వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ గోల్ సాధించాడు. దీనితో గ్రేట్ బ్రిటన్పై భారత్ 1-0 తేడాతో ఆధిక్యత సాధించింది. ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 27వ నిమిషంలో లీ మోర్టాన్ గోల్ సాధించాడు. దీనితో ఆధిక్యత 1-1 సమానమైంది.
60 నిమిషాల టైమ్ ముగిసేసరికి ఏ జట్టు కూడా మరో గోల్ సాధించలేకపోయాయి. దీనితో పెనాల్టీ షూటౌట్కు దారి తీసింది గేమ్. పెనాల్టీ షూటౌట్లో గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ జేమ్స్ ఆల్బ్రే తొలి గోల్ సాధించాడు. ఫలితంగా భారత్ 0-1 తేడాతో వెనుకపడింది. ఆ వెంటనే హర్మన్ప్రీత్ సింగ్ గోల్ వేశాడు. స్కోర్ సమం అయింది.
రెండో రౌండ్లో జాక్ వాలెస్ మరో గోల్ సాధించడంతో బ్రిటన్ ఆధిక్యత 1-2కు పెరిగింది. ఆ తరువాతి రౌండ్లో సుఖ్జీత్ సింగ్ బంతిని గోల్ పోస్ట్లోకి నెట్టడంతో ఆధిక్యత 2-2గా సమమైంది. ఇక అక్కడి నుంచి భారత్కు ఎదురు లేకుండా పోయింది. ఆ తరువాత కానర్ విలియమ్సన్ సహా బ్రిటన్ ఆటగాళ్లెవరూ గోల్స్ వేయలేకపోయారు. గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గోడ కట్టేశాడు.
అదే సమయంలో భారత్ వరుసగా గోల్స్ సాధించింది. హర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ తరువాత స్టిక్ అందుకున్న లలిత్, రాజ్కుమార్ సైతం వరుసగా గోల్ సాధించడంలో విజయవంతం అయ్యారు. 4-2 తేడాతో విజయఢంకా మోగించారు. ఒలింపిక్స్లో హాకీలో భారత్ వరుసగా సెమీ ఫైనల్స్కు చేరడం 1972 మ్యూనిచ్ తరువాత ఇది రెండోసారి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications