సరిపోయింది.. హీరో, విలన్ కొట్టుకుని కమేడియన్ మీద పడ్డట్టు: శ్రీలంక విలవిల
టీ20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు. ఇంకొక్క రోజే మిగిలివుంది. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాబోతోందీ టోర్నమెంట్. ప్రస్తుతం వామప్స్ నడుస్తున్నాయి. దీనికి తోడు బీసీసీఐ కేంద్రబిందువుగా వివాదాలూ చుట్టుముట్టాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 15వ తేదీన భారత్ను ఢీ కొనాల్సి ఉంది పాకిస్తాన్. ఈ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. లీగ్ దశలో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ లన్నింటినీ కూడా బాయ్ కాట్ చేసినట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయానా ప్రకటించారు.
శ్రీలంక ఆందోళన..
ఈ వ్యవహారంపై శ్రీలంక స్పందించింది. భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్ రద్దయితే భారీ ఆర్థిక, పర్యాటక నష్టాలు వాటిల్లుతాయని పేర్కొంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు తమ దేశంలో అత్యంత ఆదరణ ఉంటుందని, ఇది రద్దయితే టికెట్లు అమ్ముడుపోవని, స్పాన్సరర్లు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ ను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తారని, పర్యాటకరంగం కూడా నష్టపోతుందని పేర్కొంది.

క్రికెట్ ను మించి..
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అటు ప్రపంచ క్రికెట్లో మాత్రమే కాకుండా.. వాణిజ్యపరంగా కూడా అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగే ఈ పోరును క్రికెట్ ను మించి మరింత అతీతంగా భావిస్తారు కోట్లాదిమంది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో వీక్షకులను ఆకర్షిస్తుందీ గేమ్. ఐసీసీకి వచ్చే ఆదాయంలో అత్యధిక వాటా ఈ మ్యాచ్ లదే. అలాంటిది- దీన్నే బాయ్ కాట్ చేయడం ఆర్థికంగా భారీ నష్టాలను మిగుల్చుతుందనేది శ్రీలంక అభిప్రాయం. టీ20 వరల్డ్ కప్ కు కో హోస్ట్ గా వ్యవహరిస్తోందా దేశం.
పునరాలోచించుకోవాలని కోరుతూ..
పాకిస్తాన్ వైదొలగిన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యనిర్వాహక కమిటీ తాజా సమావేశమైంది. భారత్తో జరగాల్సిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతూ పీసీబీకి అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించింది. గురువారం రాత్రి ఈ లేఖను పీసీబీకి పంపించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
అన్ని రకాలుగా నష్టపోతాం..
ఈ పరిణామం భారత్, శ్రీలంక క్రికెట్ బోర్డులకే కాకుండా టోర్నమెంట్ నిర్వాహకులు, ఆతిథ్య దేశ వాటాదారులకు కూడా గణనీయమైన ఆదాయ నష్టాలకు దారితీస్తుందని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాసింది. హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ రిజర్వేషన్లు సైతం రద్దు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మ్యాచ్ నిర్వహణలో పాలుపంచుకునే స్థానిక లాజిస్టిక్స్, సర్వీస్ ప్రొవైడర్లు/ఆపరేటర్ల ఆదాయానికి గండిపడుతుందని తెలిపింది.
-
స్వదేశంలో టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే..! బీసీసీఐ షెడ్యూల్ ప్రకటన..! -
ఈసారి IPL 2026 Opening Ceremony లేదా ? ఏం జరుగుతోంది ? -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
"పాకిస్థాన్ లో నిద్రలేచిన నరరూప రాక్షసులు.. భారత్ కు పెను ముప్పు" -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!











Click it and Unblock the Notifications