Ind vs WI: విండీస్ బ్యాటర్లకు టీమిండియా బౌలర్ తండ్రి శాపనార్ధాలు..!
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) సూపర్ 8 చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్ బెర్తుల్ని ఖరారు చేసుకున్నాయి. ఇక సూపర్ 8లోని రెండు గ్రూపుల నుంచి తలో జట్టు సెమీస్ కు చేరాల్సి ఉంది. వీటి కోసం గట్టి పోటీ నెలకొంది. తాజాగా జింబాబ్వేపై ఘన విజయంతో భారత్ తమ సెమీస్ అవకాశాల్ని మెరుగుపర్చుకుంది. ఇక మార్చి 1న జరిగే పోరులో విండీస్ ను ఓడిస్తే చాలు సెమీస్ కు చేరినట్లే.
ఈ నేపథ్యంలో విండీస్ బ్యాట్స్ మెన్ దూకుడుకు టీమిండియా బౌలర్లు అడ్డుకట్ట వేయగలిగితే చాలు మ్యాచ్ మనదే, సెమీస్ బెర్తూ మనదే అని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో విండీస్ బ్యాట్స్ మెన్ బౌండరీల వర్షంపై టీమిండియా పేసర్ అర్ష్ దీప్ సింగ్ (arshdeep singh) తండ్రి దర్శన్ సింగ్ తాజాగా శాపనార్ధాలు పెట్టాడన్న ఓ వార్త బయటికి వచ్చింది. హోటల్ రూమ్ లో కూర్చుని తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో విండీస్ బ్యాట్స్ మెన్ బౌండరీలు కొడుతుంటూ వాటిని చూసి తట్టుకోలేక అర్ష్ దీప్ తండ్రి ఇలా శాపనార్ధాలు పెట్టాడట.

హోటల్ రూమ్ లో తమ కుటుంబం అంతా కూర్చుని దక్షిణాఫ్రికా, విండీస్ మ్యాచ్ చూశామని తాజాగా అర్ష్ దీప్ వెల్లడించాడు. ఈ సందర్భంగా విండీస్ బ్యాట్స్ మెన్ దక్షిణాఫ్రికా బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతుంటే తన తండ్రి తిట్ల వర్షం అందుకున్నాడని, తాను జోక్యం చేసుకుని తన తండ్రిని శాంతింపజేసినట్లు అర్ష్ దీప్ వెల్లడించాడు. క్రికెట్ ను క్రికెట్ లా చూడమని, కేవలం దక్షిణాఫ్రికా గెలవాలని మాత్రమే ప్రార్థించమని తాను తండ్రికి చెప్పినట్లు టీమిండియా పేసర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో విండీస్ పై దక్షిణాఫ్రికా గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలు మెరుగుపడ్డాయి. అలాగే జింబాబ్వేతో విజయంతో ఊపుమీదున్న భారత్.. ఇక విండీస్ పై అదే ఊపు కొనసాగిస్తే సెమీస్ బెర్తు దక్కించుకోవడం ఖాయంగా ఉంది.
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications