Ind Vs NZ: కివీస్ తో సిరీస్ కు స్టార్ ఆల్ రౌండర్ ఔట్, తెలుగు ప్లేయర్ కు పిలుపు...!!
India vs New Zealand: న్యూజీలాండ్ తో సిరీస్ వేళ టీమిండియాకు మరో షాక్. ఇప్పటికే స్టార్ కీపర్ రిషభ్ పంత్ సిరీస్ నుంచి దూరం కాగా, తాజాగా మరో స్టార్ ఆల్ రౌండర్ అదే బాట పట్టాడు. న్యూజీలాండ్ తో సిరీస్ లో తొలి మ్యాచ్ లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో భారత్ విజయం సాధించి ఆధిక్యతలో ఉంది. కాగా.. ఇప్పుడు వరుసగా ప్రధాన ఆటగాళ్ల గాయాల బారిన పడటం ప్రపంచ కప్ ముందు ఆందోళనగా మారుతోంది. ఇక.. ఈ ఆల్ రౌండర్ స్థానంలో తెలుగు ప్లేయర్ కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వైదొలి గాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో పక్కటెముకకు గాయం తగలడంతో సిరీస్ నుంచి దూరమ య్యాడు. తొలి వన్డేలోనే వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచు లో కేవలం 5 ఓవర్లపాటే బౌలింగ్ వేసి మైదానాన్ని వీడాడు. అతడి బదులు ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్ సమయంలో మాత్రం క్రీజులోకి వచ్చిన వాషీ.. ఇబ్బంది పడుతూనే కనిపిం చాడు.

కేవలం 5 ఓవర్లపాటే బౌలింగ్ వేశాడు. సుందర్ సైడ్ స్ట్రైన్తో ఇబ్బంది పడుతున్నాడని, అతడు మ్యాచ్ అనంతరం స్కానింగ్కు వెళతాడని టీమిండియా కెప్టెన్ గిల్ వివరించాడు. కాగా, రెండో వన్డే రాజ్కోట్, మూడో వన్డే ఇండోర్లో జరుగనుంది. ప్రస్తుతం భారత్ ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే.. ఈ వన్డే సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ దూరం కావటంతో ఎవరికి స్థానం దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.
ఇప్పటికే పంత్, తిలక్ వర్మ దూరం కాగా.. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ దూరం కావటంతో త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ సమయానికి ఎలాంటి పరిస్థితి ఉంటుందనే ఆందోళన టీంలో కనిపిస్తోంది. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ దూరం కావటంతో తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ లోనూ వాషింగ్టన్ స్థానం లో నితీశ్ ను తీసుకోవటం ద్వారా సరైన ప్లేస్ మెంట్ గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇదే సమయంలో ఆల రౌండర్ షాబాజ్ అహ్మద్ వైపు చూస్తున్నట్లు మరో వాదన. అక్షర్ పటేల్ సిద్దం గా ఉన్నా... ప్రపంచ కప్ కారణంగా అక్షర్ ను ఎంపిక చేసే అవకాశం కనిపించటం లేదు. అయితే, వాషింగ్టన్ సుందర్ ఒక మ్యాచ్ కే దూరం అవుతారా.. లేక, సిరీస్ మొత్తానికి దూరం అవుతారా అనేది స్పష్టత రాగానే.. రీప్లేస్ మెంట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యతలో కొనసాగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications