Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వన్డే సిరీస్‌లో ఫ్లాప్ - ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల సంచలన నిర్ణయం..!!

న్యూజీలాండ్ తో వన్డే సిరీస్ టీమిండియా కోల్పోయింది. మూడో వన్డే.. సిరీస్ డిసైడర్ అయిన చివరి మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసినా గెలుపు దక్కలేదు. బౌలింగ్.. ఫీల్డింగ్ లోపాలు బయటపడ్డాయి. ఈ సిరీస్ తరువాత టీం సభ్యుల కంటే కోచ్ గంభీర్ క్రికెట్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యారు. ఇదే సమయంలో కివీస్ సిరీస్ లో ఘోరంగా విఫలమైన ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది.

కివీస్ తో సిరీస్ కోల్పోవటంతో టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు తమ తప్పులను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఈ సిరీస్ లో ఫాం లో లేక పూర్తిగా ఆత్మరక్షణలో కనిపించిన శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఆటగాళ్లు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్దమయ్యారు. తమ రాష్ట్రాల జట్ల నుంచి ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడేందుకు సిద్దమయ్యారు.

The two senior cricketers are set to rejoin their respective state sides for the forthcoming Ranji Trophy

స్వదేశీ గడ్డ పై న్యూజీలాండ్ తో సిరీస్ కోల్పోవటం టీం ఇండియాకు కష్టంగా మారింది. ఈ సిరీస్‌లో ఏ స్థాయిలోనూ రాణించలేకపోయిన శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, తమ ఫామ్‌ను తిరిగి పొందేందుకు దేశవాలీ క్రికెట్ ఆడేందుకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 22 నుంచి రాజం కోట్ లో పంజాబ్, సౌరాష్ట్ర జట్ల మధ్య జరగనున్న రంజీ మ్యాచ్‌లో వీరు తమ టీంలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తరువాత సహజమైన ఆటకు దూరమయ్యారు. గతంలో సులభం గా షాట్స్ కొట్టిన గిల్ కెప్టెన్ అయిన తరువాత ఆ ఒత్తిడితో ఆడుతున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ, కీలకమైన డిసైడర్ మ్యాచ్ లో మాత్రం తన ఆటతో పాటుగా జట్టును నడిపించటంలో విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. ఇప్పుడు గిల్ పంజాబ్ తరపున రంజీలో ఆడేందుకు సిద్దమయ్యాడు. అదే విధంగా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం రంజీ ఆడేందుకు మైదానంలోకి దుగుతున్నారు.

The two senior cricketers are set to rejoin their respective state sides for the forthcoming Ranji Trophy

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో జడేజా ఘోరంగా విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ లో జడేజా కేవలం 43 పరుగులు చేయగా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవటం మైనస్ గా మారింది. 37 ఏళ్ల వయసులో ఉన్న జడేజా ఫామ్ ఇలాగే కొనసాగితే అతని కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. దీంతో.. తన సొంత గడ్డ రాజ్ కోట్ లో రంజీ మ్యాచ్ లో పంజాబ్ తో తల పడేందుకు సిద్దం అవుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే టెస్టు సిరీస్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ సెలెక్టర్లు దేశవాలీ మ్యాచ్ లను ఆసక్తిగా గమనిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+