Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ind-Pak Match: ఒక్క మ్యాచ్ విలువ 4500 కోట్లా? తేడా వస్తే వరల్డ్ కప్ సహా వీళ్లంతా బలి..!

వచ్చే వారం టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే ఎప్పుడు టోర్నీ ప్రారంభమవుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ జట్టు (pakistan) ఈ టోర్నీలో ఆడతాం కానీ భారత్ (india) తో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ మాత్రం ఆడబోమని తాజాగా ప్రకటించింది. చూసేందుకు సింపుల్ గా కనిపిస్తున్న ఈ ప్రకటన విలువ ఇప్పుడు రూ.4500 కోట్లని అంచనా వేశారు.

పాక్ షాకింగ్ ప్రకటన (pakistan)

ఇప్పటికే ఈ టోర్నీలో భాగంగా భారత్ లో జరిగే మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరించి మొత్తం టోర్నీనుంచే తప్పుకున్న బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ మొదలుపెట్టిన ప్రమాదకరమైన ఆట నిన్న పరాకాష్టకు చేరింది. టోర్నీలో మిగతా మ్యాచ్ లు ఆడతామని, అయితే భారత్ తో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాకయ్యింది. ఎందుకంటే ఇలాంటి మెగా టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులకు మజా, ఐసీసీ సహా క్రికెట్ బోర్డులకు లాభాల పంట, బ్రాడ్ కాస్టర్లకు పండగ ఇలా చాలా మందికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Unraveling the Threat Pakistan s Actions Cast a 4 500 Crore Shadow Over World Cricket

రూ.4500 కోట్ల విలువైన మ్యాచ్

భారత్-పాకిస్తాన్ ఫిబ్రవరి 15న ఆడబోతున్న మ్యాచ్ విలువ రూ.4500 కోట్లుగా లెక్క తేల్చారు. ఇందులో ప్రసార హక్కులు, ప్రకటనల ప్రీమియాలు, స్పాన్సర్‌షిప్ యాక్టివేషన్లు, ప్రేక్షకుల టికెట్లు, చట్టబద్ధమైన బెట్టింగ్ వంటి వాణిజ్య కార్యకలాపాలు, ఇలా చాలానే ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ కు దరిదాపుల్లో ఏ మ్యాచ్ కూడా ఉండదు. చివరికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా దీనికి సమానం కాదు. ఈ మ్యాచ్ బ్రాడ్ కాస్టర్లకు అయితే సెకనుకు ప్రకటన ఖర్చు 25-40 లక్షలు ఉంటుందంటే ఇదెంత ఖరీదైన మ్యాచ్ అనేది అర్దమవుతుంది. అందుకే ఈ మ్యాచ్ జరగకపోతే టీ20 వరల్డ్ కప్ కాస్తా తలకిందులవుతుంది.

Unraveling the Threat Pakistan s Actions Cast a 4 500 Crore Shadow Over World Cricket

ఎవరికెంత నష్టం ?

భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే నష్టపోయే వారి జాబితా భారీగానే ఉంది. ఇందులో ఒక్క బ్రాడ్ కాస్టర్ మాత్రమే ప్రకటనల ఆదాయం రూ.300 కోట్లు కోల్పోతారు. అందుకే జియో హాట్ స్టార్ ఐసీసీని పరిహారం చేయాలని కోరుతోంది. అదే జరిగితే ఆ భారం తిరిగి ఐసీసీ బాధ్యులైన బోర్డులపైనే మోపుతుంది. అలాగే ఈ మ్యాచ్ జరగకపోతే రెండు బోర్డులు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ.200 కోట్ల ఆదాయాన్ని వెంటనే కోల్పోతాయి. పాకిస్తాన్ బోర్డు అయితే ఏటా ఐసీసీ నుంచి అందే 34.51 మిలియన్ డాలర్ల నిధులు కోల్పోతుంది. అన్నింటికంటే మించి పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో విశ్వసనీయత కోల్పోతుంది. చివరిగా ఈ మ్యాచ్ కోసం విమానాలు, హోటల్స్, ఇతర సౌకర్యాలు అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న ఫ్యాన్స్ కూడా నష్టపోతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+