IND vs PAK: భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్
మహిళల ఆసియా కప్ 2026లో, భారత జట్టు పాకిస్థాన్ ను 7 వికెట్ల తేడాతో, 68 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఓడించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. 9వ ఓవర్ లో మ్యాచ్ గెలిచిన భారత జట్టు.. ఈ టోర్నమెంట్ లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ కు ఇది రెండో మ్యాచ్ కాగా, తొలి ఓటమి.
పాకిస్థాన్ బ్యాటింగ్
తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన మునీబా అలీ, షావల్ జుల్ఫికర్ 4.3 ఓవర్లలో 27 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒక ఫోర్ తో సహా 15 బంతుల్లో 13 పరుగులు చేసిన మునీబా అవుటయ్యాడు. తర్వాతి ఓవర్ లో శ్రీ చరానీ, గుల్ ఫిరోజా (0), జుల్ఫికర్ (14)లను అవుట్ చేశాడు. జట్టు కేవలం 29 పరుగుల వద్ద ఉండగా, మూడు వికెట్లు కోల్పోవడంతో కుప్పకూలింది.
35 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాత, ఉమ్మెహాని, ఇమాన్ ఫాతిమాతో కలిసి ఏడో వికెట్ కు 24 బంతుల్లో 10 పరుగులు జోడించారు. కానీ ఈ జోడి విడిపోయిన తర్వాత, జట్టు మరోసారి పేకముక్కల్లా కూలిపోయింది. భారత్ తరఫున, శ్రీ చరణీ 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, ప్రేమా రావత్ అదే ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అదే సమయంలో దీప్తి శర్మ 3.1 ఓవర్లలో 5 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకుంది.

ఇక భారత్ తరఫున, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ కొట్టింది. రెండో ఓవర్ లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా రెండు వికెట్లు తీసింది. ఆమె మొదట షెఫాలీ వర్మను, ఆ తర్వాత ప్రతీకా రావల్ ను అవుట్ చేసింది. షెఫాలీ 6 బంతుల్లో 12 పరుగులు చేయగా.. ప్రతీకా 4 పరుగులు చేసింది. స్మృతి మంధాన కూడా 11 బంతుల్లో 9 పరుగులు చేసి ఫాతిమా బౌలింగ్ లోనే అవుట్ అయింది. ఆ తర్వాత దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్ కలిసి భారత్ ను విజయ తీరాలకు. కెప్టెన్ హర్మన్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించింది. ఆమె 18 బంతుల్లో 18 పరుగులు చేసింది. దీప్తి శర్మ కూడా 12 పరుగులు చేసింది.












Click it and Unblock the Notifications