ఎన్టీఆర్పేరును ఎవరు ఎత్తాలి?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 17-03-2005
;?
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయం దేశీయటెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటూతెలుగు వారి ఆత్మగౌరవంఅంశాన్నిలేవనెత్తిన తెలుగుదేశం పార్టీ ప్రజలనుంచి సానుభూతి పొందడంలోవిఫలమైంది. హైదరాబాద్ శివారులోనిర్మాణం కానున్న అతర్జాతీయ విమానాశ్రయానికిమాజీ ప్రధాని, తెలుగుబిడ్డ పివి నరసింహారావు పేరు పెట్టాలని పార్టీలకు అతీతంగా మరో వాదన విన్పించింది.
అయితే ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడు అండ్ పార్టీకి ఎన్టీఆర్పేరు ఎత్తే అర్హత లేదన్నది మరో వాదన.నిజానికి వైస్రాయ్ క్యాంప్ పెట్టి, ఎన్టీఆర్నుగద్దె దించిన చంద్రబాబు నాయుడు నేడుఎన్టీఆర్ పేరువల్లించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేరు. ఆనాడువైస్రాయ్ హోటల్ వద్ద జరిగినసంఘటనలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.అసెంబ్లీలో ఒక్క ఆఇదు నిముషాలు మాట్లాడడానికిఅనుమతి ఇవ్వాలని ఎన్టీఆర్ కోరగా ఆనాటిస్పీకర్ యనమల రామకృష్ణుడు ఆఅవకాశం ఇవ్వలేదు. ఆ రోజు ఎన్టీఆర్ను మాట్లాడనిచ్చి ఉంటేచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిఅయ్యేవారు కాదు.
ఆ తర్వాతసీన్ వైస్రాయ్ హోటల్కు మారింది. ఎన్టీరామారావు చైతన్య రథంలో ఆహోటల్ గేటు ముందుకు వచ్చితానుగెలిపించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలకుఒక పిలుపు ఇచ్చారు. ఆ సమయంలో ఆయనమీద హోటల్ గదుల నుంచి చెప్పులవర్షం పడింది. కన్ను ఆర్పే అలవాటు లేని చంద్రబాబునాయుడు అలాగే ఆ దృశ్యాన్ని చూశారు. ఎన్టీఆర్నుగద్దె దింపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన అనంతరం పెద్దాయనఆశీర్వాదం తీసుకోడానికి ఆయన ఇంటికివెళ్ళిన చంద్రబాబును కలవడానికి ఎన్టీఆర్ నిరాకరించారు.
పదేళ్ళక్రితం జరిగిన ఈ సంఘటనలు ప్రజలుమర్చిపోలేదు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికిఎన్టీఆర్ పేరు పెట్టాలంటూ ధర్నా చేసి చంద్రబాబునాయుడుఅరెస్టు కావడాన్ని జనం ఆసక్తిగా గమనించకపోరు. తెలుగు వారిఆరాధ్య నాయకుడైన ఎన్టీఆర్ పేరునుఇక్కడ నిర్మాణమవుతున్నఅంతర్జాతీయ విమానాశ్రయానికిపెట్టాలన్న డిమాండ్ సమంజసమే. కానీ ఆడిమాండ్ చేయవలసింది మాత్రం చంద్రబాబునాయుడు కాకూడదు. ఎన్టీఆర్కు వీర విధేయులుగాచివరి వరకు మిగిలి ఉన్నవారు ఆ డిమాండ్చేయాలి. అలాగే ఈ విమానాశ్రయానికి రాజీవ్గాంధీ పేరు పెట్టడం ఎందుకు సమంజసమోముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి ఇస్తున్న వివరణ కూడాసమంజసం కాదు. నెహ్రూ కుటుంబంపైరాజశేఖరరెడ్డికి ఉన్న విధేయతప్రశ్నార్ధకమే. కేంద్రంలో, రాష్ట్రంలోకాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సమయంలోఎన్టీఆర్ పేరును ఆశించలేం. కనీసం పివి నరసింహారావు పేరు పెట్టినాతెలుగువారి ఆత్మగౌరవం నిలబడి ఉండేది.కానీ పివి నరసింహారావు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నంత కాలంఆయనకు వ్యతిరేకంగా రహస్యఉద్యమాలు నడిపిన వైఎస్కు ఆయనపేరు ఎత్తే సాహసం ఉండదు.
Recent Stories
రాంగోపాల్వర్మ హత్యకు కుట్ర?
ఏకాకిలాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినాఫలితం శూన్యం?
నేతాజీ మరణరహస్యం?
రవి అస్తమించినఅనంతపురం
కథల్లేకకదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్న్యూస్
మనసుపాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటలమరాఠీ!
ప్రెస్అకాడమీ చైర్మన్గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్వర్మ నాచ్ వివాదం
హెల్మెట్లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్హంగ్!
రాజేంద్రప్రసాద్కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామిస్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications