లేడీబాస్మార్కు విశ్లేషణ
హోంపేజి టాక్ ఆఫ్ టుడే రాజకీయాలు 27-09-2005
చెన్నై:మున్పిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రముఖసినీనటి, తెలంగాణ ఉద్యమనాయకురాలు విజయశాంతి తనదైనశైలిలో విశ్లేషించారు. మున్సిపల్ ఎన్నికల్లోఓడింది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)విధానమే గానీ తెలంగాణ నినాదంకాదని ఆమె అన్నారు. తెలంగాణ ద్రోహులపార్టీ తెలుగుదేశం పార్టీని, అవకాశవాదరాజకీయాల తెరాసను తెలంగాణ ప్రజలుఓడించాలనుకున్నారని, దాంతో తెలంగాణప్రజలు కాంగ్రెస్కు ఓటు చేశారని ఆమె భాష్యంచెప్పారు. తెరాస నేతలు కె.చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రఓవర్ యాక్షన్ తెరాసనుఓడించిందని కూడా ఆమె అన్నారు.తెలంగాణలో ఎన్నికల తీర్పు కెసిఆర్కు,నరేంద్రలకు వ్యతిరేకమని ఆమెఅన్నారు.
ఇప్పటికైనాకెసిఆర్, నరేంద్ర మంత్రిపదవులకు రాజీనామా చేసి తెలంగాణఉద్యమాన్ని నడిపించాలని ఆమెపిలుపునిచ్చారు. ఏ విషయంలోనైనా స్పష్టతఉండాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆమెతెరాస నేతలకు పాఠంచెబుతున్నారు. తెరాస మీద తెలంగాణప్రజలకు నమ్మకం పోతోందని, నిజమైనతెలంగాణ పార్టీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, అటువంటి పార్టీలేకపోవడంతో తెలంగాణ ప్రజలుకాంగ్రెస్కు ఓటు చేశారని ఆమె అన్నారు.
సమైక్యవాదానికి చోటు లేదని తెలంగాణ ప్రజలుమరోసారి చాటి చెప్పారని, ఇప్పటికైనాతెలుగుదేశం పార్టీ తన విధానంమార్చుకుంటే మంచిదని విజయశాంతిఅన్నారు. తెలుగుదేశం పార్టీని ఓడించేసత్తా తెరాసకు లేదని గ్రహించినతెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటు చేశారనిఆమె చెప్పారు.
తెలంగాణనినాదం, తెలంగాణ పోరాటం,ఆత్మగౌరవం ఓడిపోదని, తన లాంటిలక్షలాది మంది కార్యకర్తలుముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమానికిఊపిరి పోయాలని ఆమె అన్నారు. తెలంగాణఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందామని ఆమెఅన్నారు.
తెరాసఅపజయమే తప్ప తెలంగాణ ఓటమి కాదనితేల్చి చెబుతున్న విజయశాంతి తల్లితెలంగాణ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలుచేసుకుంటున్నారు. పార్టీ పేరు నమోదుకోసం ఎన్నికల కమీషన్కు ఆమె దరఖాస్తుచేశారు.
ఇటీవలికథనాలు హోంపేజి