చిరంజీవికి ఆ 30 మాత్రమేనా?
294 స్ధానాలు గెలుచుకుంటామని అల్లు అరవింద్ చేసిన ప్రకటనను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆయన ఒక కమర్షియల్ సినిమా నిర్మాత మాట్లాడినట్టు రాజకీయ స్టేట్ మెంట్లు ఇవ్వడం గమనించదగిన విశేషం. చిరంజీవి పార్టీకి ఇమేజి క్రమంగా తగ్గిపోడానికి ప్రధాన కారణం జనం సినిమాలను, రాజకీయాలను విడివిడిగా చూడడమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చిరంజీవి పార్టీకి ఒక సైద్ధాంతిక పునాది లేదన్నది వాస్తవం. సామాజిక న్యాయం గురించి చిరంజీవి చిలక పలుకులు పలుకుతున్నా దాని మీద ఆయనకే అవగాహలేనట్టు కనిపిస్తోంది. 80 శాతం ప్రజలు అణగారిన వర్గాలుగా ఉన్నప్పుడు వారి గురించి సంపూర్ణ అవగాహన లేకుండా ప్రసంగించడం మంచి పద్ధతి కాదు.
చిరంజీవికి ముప్పై స్ధానాలకు మించి రావన్నది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేసిన ప్రైవేటు సర్వేలలో తేలిన అంశం. దానికీ ఆ పార్టీలు హాయిగా ఊపిరి తీసుకుని ఎన్నికల అనంతరం అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చల్లో పడ్డాయి. అయితే "ప్రజారాజ్యం" పార్టీ రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందకుండా డార్క్ హార్స్ లా అధికారం చేజిక్కించుకుంటుందని ఆ పార్టీకి చెందిన మేధావులు నమ్మకంగా చెబుతున్నారు. వేచి చూడాలి.