బాబుకు 'మహా' ముప్పు

తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న వరంగల్ వంటి లోకసభ సీట్లు తెరాసకు వెళ్లడంతో ఆ పార్టీలో తీవ్ర అసమ్మతి పెల్లుబుకుతోంది. తెలుగుదేశం పార్టీలో స్థానిక తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాదు జిల్లాలో అసమ్మతి వీధికెక్కింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు.మహబూబ్ నగర్, అచ్చంపేట శాసనసభా స్థానాలను తెరాసకు కేటాయించడంతో ఆ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మాజీ శాసనసభ్యుడు శ్రీపతి రాజేశ్వర్ సనత్ నగర్ సీటు దక్కకపోడంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. సనత్ నగర్ సీటు నుంచి తెరాస మాజీ శాసనసభ్యుడు టి. పద్మారావు పోటీ చేస్తున్నారు. గతంలో శ్రీపతి రాజేశ్వర్ సనత్ నగర్ సీటు నుంచి శాసనసభకు గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు.
ఇదిలావుంటే, మహా కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుందా, లేదా అనే అనుమానం కూడా చంద్రబాబును పీడిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీకి తెరాస ఓట్లు పడతాయా, లేదా అనేది అనుమానం. అలాగే, పైగా తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిత్రపక్షాలకు ఓట్లు వేస్తారా అనేది కూడా అనుమానమే. నిజానికి, తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. మిత్రపక్షాలకు అత్యధిక స్థానాలు తెలంగాణలోనే కేటాయించడం వల్ల తెలుగదేశం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాంగ్రెసు పార్టీని మట్టి కరిపించే ఉద్దేశంతో ఏర్పాటైన మహా కూటమి వల్ల తెలుదుగుదేశం పార్టీకి మొదటికే మోసం వస్తుందా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం.
అలాగే, సీట్ల విషయంలో వామపక్షాలకు, తెరాసలకు మధ్య కూడా పొంత కుదరడం లేదు. తెరాస అడిగిన కొన్ని సీట్ల కోసం వామపక్షాలు పట్టుబడుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని తెరాసకు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సీటును సిపిఎం అడుగుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారైందని, తమకు తెలుగుదేశం పార్టీ 16 సీట్లు కేటాయించిందని వచ్చిన వార్తలను సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు మెలిక పెట్టారు. సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదని, తమకు 20 శాసనసభా స్థానాలు కేటాయించాలని ఆయన అంటున్నారు. ఆ 20 శాసనసభా స్థానాల జాబితాను ఆయన మీడియాకు అందజేశారు. తెరాసతో పొత్తుతో సీట్ల సర్దుబాటు కొలికి వచ్చి అంతా సజావుగా జరిగిందని భావిస్తున్న తరుణంలో చంద్రబాబుకు ఈ తాజా పరిణామం తలనొప్పిగా మారింది.
ఇదిలా వుంటే, మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న సిపిఎం ఓట్లు తెరాసకు పడ్తాయా అనే సందేహాలు కూడా లేకపోలేదు. అలాగే, తెలంగాణ జాతీయాంశం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఇటీవల ఒక మెలిక పెట్టారు. దీంతో తెరాసకు, వామపక్షాలకు మధ్య ఓట్ల బదిలీపై అనుమానాలు పొడసూడచడం సహజం. మొత్తం మీద, చంద్రబాబుకు మహా కూటమితో పెద్ద ప్రమాదమే పొంచి ఉందని అంటున్నారు.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications