రాజకీయ వ్యూహంలో బాబు కంటే చిరంజీవి బెటరా?

రాష్ట్ర అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయారు. ఆయన పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తామని హెచ్చరించడాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్టీ రామారావు తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్ధలను పటాపంచలు చేయడంతో బిసి, ఎస్ సి, ఎస్ టి లు తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా మారారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు ఊగిసలాట ధోరణి ఆ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.
చిరంజీవి స్పష్టంగా సమైక్యాంధ్ర వైఖరి తీసుకుని కోస్తాలో, రాయలసీమలో పర్యటించడం ప్రజారాజ్యం పార్టీకు ప్లస్ గా మారింది. జగన్ కూడా సమైక్యాంధ్ర వాది అయినా కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఆయనకు అనుకూలంగా ఎటువంటి సంకేతాలు రావడం లేదు. చిరంజీవి ముందడుగు వేయడం కోస్తా, సీమల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆ 30 శాతమో, 25 శాతమో పదిలం. కొత్త ఓటర్లు, చదువుకున్న వారు, తటస్ధులు టిడిపికి ఓటు వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ చంక్ అంతా చిరంజీవి ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపే అవకాశముంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications