హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ కుటుంబంలో ముసలం?

By Staff
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: ఎన్టీఆర్ కుటుంబంలో మళ్ళీ ముసలం రాజుకుంది. చంద్రబాబు నాయుడు మహాకూటమి స్ధాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు హరికృష్ణను లైట్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. హరి గత నెల రోజులుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రావడం లేదని తెలిసింది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఉంటే చాలని, హరికృష్ణ ఆయన కుమారులు లేకపోయినా ఫర్వాలేదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనితో మనస్ధాపం చెందిన హరికృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

చంద్రబాబు నాయుడు చాలా టక్కరి నక్క అని గతంలో తన మిత్రుల వద్ద వ్యాఖ్యానించిన హరికృష్ణ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యాఖ్యానాన్ని బహిరంగంగా చెప్పుకోవలసిన పరిస్ధితులు దాపురించాయి. అయితే ఇంటి గుట్టు గడప దాటకూడదనే పాలసీ హరికృష్ణది. ఎన్ని సమస్యలు వచ్చినా కడుపులో దాచుకోవడం, శరీరం తూలినా, మనసును తూలినివ్వకపోవడం ఆయన ప్రత్యేకత. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆయనే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ లో వెలిగిపోతున్న పురంధరేశ్వరి కావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి----మొత్తంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యుల ఉన్నతి కావాలి. ఆయన దృష్టిలో సామాన్య జనం ఎన్టీఆర్ కుటుంబానికి అభిమానులు. వాళ్ళకి ఆశలు ఉండకూడదు. భవిష్యత్తు ఉండకూడదు.

చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కువగా బాలకృష్ణ మీద, జూనియర్ ఎన్టీఆర్ మీద ఆధారపడుతున్నారు. బాలకృష్ణ తన వియ్యంకుడు కావడంతో ఇద్దరికీ మంచి అవగాహన ఉంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సేఫ్. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు చేరదేశారు. జూనియర్ ను ఎన్టీఆర్ కుటుంబం సొంత మనిషిగా చూడడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. దానితో హరికృష్ణని పరోక్షంగా దెబ్బతీయడానికి చంద్రబాబు జూనియర్ ను వాడుకుంటున్నారన్నది ఆరోపణ. ఎన్నికల లోపు అన్ని విషయాలు బయట పడతాయి. కానీ ఎన్టీఆర్ కుటుంబం గుట్టు గడపదాటకపోవచ్చు. ఈలోపు ఎన్నో రాజీలు జరగవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X