సత్యం రాజు రామదాసా?
మేటాస్ కొన్ని వందల ఎకరాల భూములను కొనుగోలు చేసింది. మరికొన్ని వందల ఎకరాలకు అడ్వాన్సులు ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో సత్యం కంపెనీలో సంక్షోభం ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్టును చేజిక్కించుకోడానికి సత్యం రాజు ఎన్నో కిక్ బ్యాక్స్ ను రాజకీయ నాయకులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ అంతా అయిపోయినా ఆదాయాలు తిరిగిరాకపోవడంతో రాజుగారచె"చెయ్యి" కలిపిన పాపానికి చేతులెత్తక తప్పలేదు.
రామలింగరాజు బెయిల్ కోసం సీరియస్ గా ప్రయత్నించకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. బయటికి వస్తే తన ప్రాణాలకు రక్షణ ఉండదని, జైలే పదిలమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన అరెస్టయిన కొత్తలో ఒక వ్యాఖ్య చేశారు "నేను పులి మీద స్వారీ చేశాను. ఆ పులి తినేస్తుందని తెలిసినా అలా చేయవలసి వచ్చింది" అన్నారు. ఆ వ్యాఖ్యలు పులివెందులను ఉద్దేశించి చేసినవేనని పరిశీలకులు అంటున్నారు.
రామలింగరాజు, రాజశేఖరరెడ్డి మధ్య కుదిరిన రహస్య అవగాహన ఆ తర్వాత ఎలా బెడిసికొట్టిందో ప్రతిపక్షపార్టీలు సమర్ధంగా బయటపెట్టలేకపోయాయి. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా సత్యంరాజుకు వరాలు ఇవ్వడం ఇందుకు ఒక కారణం కావచ్చు. బిల్ గేట్స్ పక్కన రాజును కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడికి భారీగా సత్యం షేర్లు లభించినట్టు అందరికీ తెలిసిన విషయమే.