ఏదో తేల్చుకోవడానికే...

ఇప్పటికే పార్టీ అధిష్ఠాన వర్గం వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అనుకూలంగా లేనట్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి కాకుండా ఇతర పదవులు ఆశ చూపినట్లు కూడా వార్తలు వచ్చాయి. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవిని జగన్ వర్గీయుల తోసిపుచ్చినట్లు కూడా సమాచారం. ఈ స్థితిలో చివరి ప్రయత్నంగా అధిష్ఠానవర్గాన్ని ఒప్పించేందుకు కెవిపి ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు.
కెవిపి రామచందర్ రావు మరోసారి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశం ఉంది. ప్రణబ్, కాంగ్రెసు అధికార ప్రతినిధి మనీష్ తివారీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు కెవిపిని ఆందోళనకు గురి చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నేతను ఎన్నుకోవడానికి ఇంకా సమయం ఉందని, ఈ విషయంలో తొందరేమీ లేదని ప్రణబ్ అనగా ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులున్నారని మనీష్ తివారీ అన్నారు. అలా ప్రకటనలు రావడం వెనక గల కారణాలేమిటో కెవిపికి అంతం పట్టడం లేదని అంటున్నారు. దీన్ని బట్టి ఇప్పుడిప్పుడే నాయకత్వ విషయాన్ని తేల్చడానికి సిద్ధంగా లేరని అర్థమవుతోందని భావిస్తున్నారు. అయితే, కెవిపి ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications