మన్మోహన్ కు 'సత్యం' పోటు?

సత్యం వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరిగింది. మన్మోహన్సింగ్ అనారోగ్యానికి ఈ ఒత్తిడి కూడా కారణం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్లే మన్మోహన్సింగ్ శుక్రవారం గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఢిల్లీలో ఆస్పత్రిలో చేరారనుకుంటున్నారు. ఆయనకు శనివారం బైపాస్ శస్త్ర చికిత్స జరుగుతోంది.
"సత్యం" కుంభకోణంపై విచారణలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మెతకగా వ్యవహరిస్తున్నారన్న విషయం ఆర్ధిక నిపుణుడైన ప్రధాని మన్మోహన్ గ్రహించినట్టు జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ కుంభకోణం విచారణ తీరుపై ప్రధాని సంతృప్తిగా లేరని తెలుస్తోంది.
నిజానికి... ఇండియాలో ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా, భారత్-అమెరికాల దై్వపాక్షిక సంబంధాలు ఎన్నడూ దెబ్బతినలేదు. అలాగే అమెరికాలో రిపబ్లికన్లు రాజ్యమేలినా, డెమొక్రాట్లు ప్రభుత్వ పగ్గాలు చేపట్టినా రెండు దేశాల సంబంధాలు మరింత పెరిగాయే కానీ క్షీణించలేదు. ఐటి రంగంలో భారతీయ నిపుణులు అమెరికాలో ఎన్నో సేవలందిస్తున్నారు. అలాగే భారతదేశంలో అభివృద్ధి పథకాలకు ప్రపంచబ్యాంక్ అపారంగా నిధులు అందించడం వెనక కూడా అమెరికా హస్తముందనే చెప్పాలి. గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆంధ్రప్రదేశ్కు రావడం ఒక చారిత్రక సందర్భమని చెప్పుకోవాలి.
గతంలో జి-7, జి-21లలో ఇండియాకు సభ్యత్వం లేకున్నా, ఆయా గ్రూప్లు నిర్వహించిన శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధానికి ఆహ్వానం అందిం దంటే దాని వెనక అమెరికా ప్రేరణ ఉందని గట్టిగా చెప్పవచ్చు. అలాగే యూఎస్లో న్యూయార్క స్టాక్ ఎక్సే్ఛంజ్లో ప్రసంగించడానికి అమెరికా భారత ప్రధానినికి అవకాశం ఇవ్వడంమనదేశంపట్ల అమెరికాకున్న అపారమైన గౌరవానికి తిరుగులేని నిదర్శనం. అలాగే, భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వంకోసం జరిగే ప్రయత్నంలో అమెరికా సహకారం కూడా ఉందంటారు.
రెండు దేశాల మధ్య ఇంతటి గౌరవ మర్యాదలు, సన్నిహితత్వం, సహకారం ఉన్నా ఈ నెల 20న జరిగిన అమెరికా నూతన అధ్యక్షుడిగా బారక్ ఒబామా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇండియా నుంచి అధికారికంగా రాష్టప్రతి, ప్రధాని వంటి ఉన్నత హోదాలో ఉన్న వారెవరూ హాజరు కాలేదు. ఒబామా ప్రమాణస్వీకారోత్సవానికి చాలా దేశాల ఆధినేతలు హాజరయ్యారు. కానీ భారతదేశం నుంచి ఆ స్థాయి వారు ఎవరూ అంటే రాష్టప్రతి కానీ, ప్రధాని కానీ, కేంద్ర మంత్రివర్గంలో ఎవరైనా కానీ ఇండియా ప్రతినిధిగా హాజరు కాకపోవడానికి కారణమేమిటి? అన్నది పలువర్గాల వారిని వేధిస్తున్న ప్రశ్న.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!












Click it and Unblock the Notifications