ముఖ్యమంత్రి పదవిపై మళ్ళీ జగన్ కు ఆశలు!

కీలక సమయంలో సమైక్య సందేశాన్ని గట్టిగా విన్పించడం ద్వారా జగన్ కాంగ్రెస్ హై కమాండ్ కు గట్టి సంకేతాలనే పంపారు. వైఎస్ మనిషి అయిన లగడపాటి రాజగోపాల్ నాయకత్వంలో కోస్తాంధ్రలో సమైక్య ఉద్యమం పటిష్టంగా కొనసాగుతోంది. జగన్ దానిని కొండంత అండగా భావిస్తున్నారు. జగన్ ప్రసంగం ఎక్కడా ఆవేశపూరితంగా లేదు. కంఠస్తం చేసుకుని విన్పించినట్టుగా ఉంది. ఈ సమయంలో తనకు రాష్ట్రం పగ్గాలు ఇస్తే సమైక్యాంధ్రను చక్కగా నడిపిస్తానని, అధిష్టానవర్గానికి అనవసరపు తలనోప్పులు తీసుకురానని ఆయన చెప్పకనే చెప్పనట్టయింది.
అపార అనుభవం గల రోశయ్య నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన బాగానే ఉన్నప్పటికీ ఆయనలో డైనమిజం లోపించింది. ఎంతవరకు హైకమాండ్ పై ఆధారపడి ఉండడం తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఆయనకు లేకపోవడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విసుగు కలిగిస్తోంది. ఇప్పుడు వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన వీరప్ప మొయిలీ వంటి వారు జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇప్పించడానికి పావులు కదిపే అవకాశముంది. తేనెతుట్టెను కదిపి బాధపడుతున్న సోనియా గాంధీ ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో మరో తొందరపాటు నిర్ణయం తీసుకుంటారా? కొంత కాలం రోశయ్యనే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications