వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి పదవిపై మళ్ళీ జగన్ కు ఆశలు!

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: నేడు మీడియాను ఉద్దేశించి కడప ఎంపీ వైఎస్ జగన్ ఢిల్లీలో ఆంగ్లంలో చేసిన ప్రసంగం చెప్పుకోదగిన రీతిలో ఉంది. సమైక్యాంధ్ర కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే జగన్ ఎన్నో రెట్లు స్పష్టతతో మాట్లాడారు. నిన్న మొన్నటివరకు జగన్ ను పిల్లకాకిలా కొట్టి పడేసిన వారు నేడు నోటి మీద వేళ్ళు వేసుకోవలసి వచ్చింది. తాను ప్రత్యేక తెలంగాణకు, ప్రత్యేక రాయలసీమకు, ప్రత్యేక ఆంధ్రకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అందరూ అన్నదమ్ముల్లా ఉండాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఎంతో పరిపక్వతను ఆయన కనబరిచారు. రాజగోపాల్ తో కలిసి జగన్ వర్గం ఒక పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోందన్న వాదన దాదాపు నిజమైంది.

కీలక సమయంలో సమైక్య సందేశాన్ని గట్టిగా విన్పించడం ద్వారా జగన్ కాంగ్రెస్ హై కమాండ్ కు గట్టి సంకేతాలనే పంపారు. వైఎస్ మనిషి అయిన లగడపాటి రాజగోపాల్ నాయకత్వంలో కోస్తాంధ్రలో సమైక్య ఉద్యమం పటిష్టంగా కొనసాగుతోంది. జగన్ దానిని కొండంత అండగా భావిస్తున్నారు. జగన్ ప్రసంగం ఎక్కడా ఆవేశపూరితంగా లేదు. కంఠస్తం చేసుకుని విన్పించినట్టుగా ఉంది. ఈ సమయంలో తనకు రాష్ట్రం పగ్గాలు ఇస్తే సమైక్యాంధ్రను చక్కగా నడిపిస్తానని, అధిష్టానవర్గానికి అనవసరపు తలనోప్పులు తీసుకురానని ఆయన చెప్పకనే చెప్పనట్టయింది.

అపార అనుభవం గల రోశయ్య నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన బాగానే ఉన్నప్పటికీ ఆయనలో డైనమిజం లోపించింది. ఎంతవరకు హైకమాండ్ పై ఆధారపడి ఉండడం తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఆయనకు లేకపోవడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విసుగు కలిగిస్తోంది. ఇప్పుడు వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన వీరప్ప మొయిలీ వంటి వారు జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇప్పించడానికి పావులు కదిపే అవకాశముంది. తేనెతుట్టెను కదిపి బాధపడుతున్న సోనియా గాంధీ ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో మరో తొందరపాటు నిర్ణయం తీసుకుంటారా? కొంత కాలం రోశయ్యనే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X