ఎదురులేని వైఎస్

"70 ఏళ్ళు దాటిన వారికి కాంగ్రెస్ టికెట్లు ఉండవు" అని రాజశేఖరరెడ్డి ఇటీవల ప్రకటించినప్పటి నుంచి ఈ వృద్ధ సింహాలు రాజశేఖరరెడ్డి అంటే భయపడి చస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఎంఎస్, పురుషోత్తమరావు, వెంకటస్వామి వంటి వారు వైఎస్ ప్రకటనతో భయపడినా కాళ్ళ బేరానికి రాలేదు. కాళ్ళ బేరానికి వచ్చినవాడు ఒక్క రోశయ్యే. ఈసారి చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుస్తానన్న ఆశ ఆయనకు ఏ కోశాన లేదు. అందువల్ల వైఎస్ తోక పట్టుకుంటే ఈసారి రాజ్యసభకు వెళ్ళవచ్చన్న ఆశ ఈ రాజకీయ శ్రేష్టుడికి పట్టుకున్నట్టుంది.
తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల వత్తిడిని తట్టుకుని కాంగ్రెస్ హై కమాండ్ వద్ద తనదే పై చేయి అని చాటుకున్న వైఎస్ 294 స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను, అన్నిటిలోనూ తన సొంత మనుషులను నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధించకపోయినా కనీసం వంద మంది తన సొంత ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కూర్చోవాలన్న పట్టుదల వైఎస్ లో కనిపిస్తోంది. వైఎస్ అంటే ఇప్పుడు అధిష్టాన వర్గానికి కూడా పెద్ద దడ ఉంది. ఈ కీలక సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పోవడం పార్టీ శ్రేయస్సుకు మంచిది కాదన్న అభిప్రాయంతో అధిష్టాన వర్గం ఉంది.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications