వైఎస్ రిటైర్మెంట్ ఎప్పుడు?

ఇప్పుడు ప్రజానాయకుడిగా మారిన రాజశేఖర రెడ్డి రిటైర్ అవుతానన్నా జనం ఒప్పుకోరేమో. కానీ వచ్చే ఐదేళ్ళలో అయినా కాంగ్రెస్ నాయకులు ధనాపేక్ష లేకుండా ప్రజల సంక్షేమం కోసం అభి వృద్ధి కోసం కృషి చేయాలని సామాన్యులు కోరుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. కెవిపి రామచంద్రరావు, వైఎస్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే నిత్యావసర వస్తువుల అధిక ధరలు వారికి లొంగడం లేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అని వారు సరి పెట్టుకుంటున్నా, జనానికి అంత నాలెడ్జి ఉండదు కదా. అధిక ధరలకు కారణం వైఎస్సేనని అనుకునే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపధ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత తేలిక కాకపోవచ్చు.
ప్రత్యర్ధి పార్టీలలో చిచ్చు పెట్టడం, నన్నపనేని రాజకుమారి వంటి మహిళా నాయకులపై దాడులు చేయించడం, టిడీపి దళిత ఎమ్మెల్యే రామారావుపై కక్ష సాధించడం వైఎస్ కు మంచి తెచ్చే విషయాలు కావు. కందిపప్పు కిలో వందకు ఎగబాకడం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లోటులో కుంగిపోయి ఉంది. చిరంజీవి పార్టీని, టీఅర్ ఎస్ ను వైఎస్ చావు దెబ్బతీశారు. ఆ చిచ్చు టిడిపిలో కూడా రగులుతోంది. ఆయన ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నా మరో ఐదేళ్ళ నాటికి జనం మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఆయన ఇరిగేషన్ ప్రాజెఖ్తులు, సెజ్ ల మీద కాకుండా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమేమో.
-
హోటల్ మేనేజ్మెంట్ లో ఆన్ లైన్ శిక్షణ, ఉద్యోగాలు- అర్హతలు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications