వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యకు బాపు రాజ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
వైవిధ్య దర్శకుడు బాపు చిత్రం వస్తుందంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుంది. ఇక కథానాయకుడు బాలకృష్ణ చిత్రం అంటే అంతా హడావుడే. అలాంటి ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుంది. ఈ నెల 30న ఆ చిత్రం ప్రారంభం కాబోతుంది. ఆ చిత్రానికి శ్రీరామ రాజ్యం అనే పేరును పెట్టారు. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా నయనతార నటించనుంది. బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా ఈ చిత్రంలో కనిపించనున్నట్టు సమాచారం.

పౌరాణిక పాత్రలకు పెట్టింది నందమూరి వంశం. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పౌరాణిక పాత్రల్లో నటిస్తూ ఆందరి మన్ననలు అందుకుంటున్నారు. సీ.ఎన్టీఆర్ వేసినన్ని పౌరాణిక పాత్రలు ఎవ్వరూ వేయటం లేదు. ఇక జూ ఎన్టీఆర్ కూడా రాముడిగా, యముడిగా వేశాడు. బాలకృష్ణ కృష్ణుడిగా, బలరాముడిగా మొన్న కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పాండురంగడిగా జీవించాడు. ఇప్పుడు బాపు దర్శకత్వంలో రాముడిగా కనిపించనున్నాడు. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో సింహా చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్లో తీయడానికి ఇప్పుడు బాపు సిద్ధమయ్యారు.

బాపు చిత్రాలన్నీ సామాజిక స్పృహ కలిగి ఉన్నవే. స్త్రీని చూపించటంలో బాపుని మించిన వారు లేరు. ఆయన చిత్రాల్లో నటించిన కథానాయికను బాపుబొమ్మ అనటం కద్దు. అందుకే ఆయన చిత్రంలో ఆవకాశం వస్తే ఏ కథానాయిక అయినా ఎగిరి గంతేస్తుంది. తన సుడి తిరిగినట్లేనని భావిస్తుంది. హీరోలు సైతం అలానే భావిస్తారు. భానుప్రియ, స్నేహ వంటి కథానాయికలు బాపుబొమ్మలుగా పేరుగాంచినవారే. కథానాయకులు సైతం బాపు చిత్రంలో నటించడానికి ఉత్సాహపడుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X