కెసిఆర్ పై బ్లాక్ మెయిలింగ్ఆరోపణలు

జూనియర్ ఎన్టీఆర్ 'అదుర్స్' ను తెలంగాణలో ఆడనివ్వబోమని ప్రకటించిన కెసిఆర్ కుమార్తె కవితకు ఆ తర్వాత 2 కోట్ల రూపాయలు అందాయని ఒక ప్రముఖ వెబ్ సైట్ ప్రముఖంగా రాసింది. డబ్బు అందిన తర్వాత రాజీ కుదిరి తెలంగాణలో సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చారని వెల్లడించింది. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అనుకోవాలేమో.
కెసిఆర్ స్వయంగా స్ధితిమంతుడు. దొరల కుటుంబంలో పుట్టిన ఆయనకు చాలా ఆస్ధులున్నాయి. ఆయన ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి సంపాదించుకోనవసరం లేదేమో. కేంద్రమంత్రి షిప్పింగ్ మంత్రిగా కూడా ఆయన బాగా సంపాదించుకున్నారని, అందువల్లనే తర్వాత ఆయనను డబ్బు ప్రాధాన్యం లేని కార్మిక శాఖకు పంపించారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇందులో సత్యమెంతో అసత్యమెంతో తేలవలసి ఉంది. ప్రముఖంగా వెలిగేవారి మీదనే దుష్ప్రచారాలు ఎక్కువగా ఉంటాయి.
ఏపార్టీ కైనా రిలయెన్స్ తరహాలో విరాళాలు ఇచ్చే గుణం జివికెలో ఉందంటున్నారు. దాని ప్రకారం జివికె కెసిఆర్ కు కొద్దో గోప్పో బహుమతిగా ఇచ్చిన విషయం నిజమైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications