సిఎం పదవిపై మళ్ళీ జగన్ ఆశలు, సోనియా బ్రేక్!

వైయస్ మరణంపై టీవి చానెళ్ల వార్తాకథనాలు, రిలయన్స్ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైయస్ మరణం వెనక రిలయన్స్ అధినేతల హస్తం ఉందంటూ టీవీ 5 తో పాటు సాక్షి టీవీ చానెల్ లో వార్తా కథనం ప్రసారం కావడాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
కార్పొరేట్ సంస్థల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మీడియా చానెళ్ల వార్తా కథనాలపై రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సీరియస్ గా తీసుకున్నారు. సోనియాకు ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసత్య ప్రచారంపై, రిలయన్స్ ఆస్తులపై దాడులపై ఆయన సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications