తెలంగాణలో జగన్ పర్యటన?

YS Jagan
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణలో పర్యటిస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్న సమయంలో శాసనసభ్యురాలు కొండా సురేఖ ఓ ప్రకటన చేశారు. జగన్ తెలంగాణలో పర్యటించి తీరుతారని ఆమె ఆదివారం వరంగల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. వైయస్ జగన్ తెలంగాణలో తప్పకుండా పర్యటిస్తారని, వైయస్సార్ మరణానికి షాక్ తిని మృతి చెందినవారి కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించి తీరుతారని ఆమె నమ్మబలికారు. వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించడానికి పూనుకున్నప్పుడు జరిగిన ఘర్షణ, సంభవించిన పరిణామాలు ఇంకా మరిచిపోనే లేదు. మళ్లీ జగన్ పర్యటన ఊసును సురేఖ ఎత్తడం పలువురిని ఆశ్చర్యపరిచింది. పైగా, వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఒక్కో జిల్లాలో నెలకు పైగా జరుగుతోంది.

వైయస్ జగన్ ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను చేపట్టి నెల రోజులు దాటింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఆయన నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపడతారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చెప్పారు. ఆయన ఓదార్పు యాత్ర ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో మాత్రమే జరిగింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓదార్పు యాత్ర ముగిసిన తర్వాతనే జగన్ తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల జగన్ ఓదార్పు యాత్ర తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఉండదని తెలిసిపోతూనే ఉన్నది.

కాగా, కాంగ్రెసులో వైయస్ జగన్ ను మించిన ప్రజాకర్షక నాయకుడు కాంగ్రెసులో లేరని కొండా సురేఖ భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. జగన్ ను కాదంటే కాంగ్రెసు పార్టీకి దిక్కు లేదని కూడా ఆయన అన్నారు. తాము వైయస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెసుకు జగన్ తప్ప గతి లేదనే పద్ధతిలో ఆయన వర్గీయులు మాట్లాడుతున్నారు. కాంగ్రెసును రక్షించే నాయకుడు జగన్ మాత్రమేనని చెప్పేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా, జగన్ ఓదార్పు యాత్ర ఎటు దారి తీస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+