తెలంగాణకు ముందు సిఎంగా జైపాల్

ఈ నెల 31లోపు పిళ్లైకి నివేదిక సమర్పించిన అనంతరం, జనవరి 3 లేదా 4వ తేదిలో శ్రీకృష్ణ కమిటీ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తెలంగాణ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్లీనరీలో పాల్గొంటున్న వీరంతా అక్కడ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఓ మంత్రి కూడా జైపాల్ రెడ్డిని పవర్ కేంద్రంగా అభివర్ణించడం గమనార్హం. తెలంగాణకు వ్యతిరేకి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయ్యే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కాస్త ఆలస్యమైనప్పటికీ రాష్ట్రం ఇచ్చే ముందు తెలంగాణకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టే దిశలో తెలంగాణ కాంగ్రెస్ వారు అధిష్టానాన్ని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రకటనకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సైతం మరో ఆరునెలలే ఆ పీఠంపై ఉంచుతారనే వాదనలు కూడా జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలనే యోచనకు బలం చేకూరుస్తున్నాయి. రోశయ్య ముఖ్యమంత్రి పీఠం నుండి దిగినప్పుడు మొదట అధిష్టానం జైపాల్ రెడ్డివైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ ప్రకటించకపోతే సమస్యలు తలెత్తే అవకాశాలున్నందున ఆయన దూరం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇఫ్పుడు తెలంగాణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తుండటంతో జైపాల్ రెడ్డిని చివరి ముఖ్యమంత్రిగా సిఎంపీఠంపై కూర్చుండబెట్టడానికి అధిష్టానం కూడా సంసిద్ధత వ్యక్తం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications