'స్వాతి' బలరామ్ కు అల్లుడి శని?

స్వాతి కార్యాలయాన్ని ఇటీవల అల్లుడి సహాయంతో బలరామ్ కూతురు, భార్య స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సహకారంతో వారు బలరామ్ లేని సమయం చూసి స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. తన కార్యాలయం స్వాధీనంపై వేమూరి బలరామ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తన అల్లుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వేమూరి బలరామ్ అల్లుడు అనిల్ కుమార్ ఆదాయం పన్ను శాఖలో అదనపు కమిషనర్ గా పనిచేస్తున్నారు. తన అధికారాన్ని వినియోగించి అనిల్ కుమార్ విజయవాడ నగర పోలీసు కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారని, దీంతో పోలీసు కమిషనర్ తన భార్యకు, కూతురుకు అనుకూలంగా వ్యవహరించారని వేమూరి బలరామ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన అభ్యంతరం చెప్పారు. తమ వ్యవహారంలో పోలీసుల జోక్యాన్ని నివారించాలని ఆయన హైకోర్టు అభ్యర్థించారు. తనను తన కార్యాలయంలో ప్రవేశించడానికి అనుమతించాలని కూడా ఆయన కోరారు.
స్వాతి యాజమాన్యం హక్కు వివాదం పెండింగ్ లో ఉందని చెబుతూ తన కార్యాలయం నుంచి భార్య, అల్లుడు, కూతురు తీసికెళ్లిన కీలక పత్రాలను తనకు తిరిగి ఇప్పించాలని ఆయన కోరారు. మొత్తం మీద, వేమూరి బలరామ్ తీవ్రమైన చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు. లక్షలాది మంది పాఠకుల చేతుల్లో అలంకారంగా ఉంటూ వస్తున్న స్వాతి వారపత్రిక భవిష్యత్తు కూడా చిక్కుల్లో పడిందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications