జగన్ క్యాంప్ మంత్రులకు షాక్?

జగన్ వర్గానికి చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణపై కూడా వేటు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డికి డిమోషన్ ప్రమాదం ఉంది. వైయస్ మరణాంతరం సంభవించిన శాంతిభద్రతల సమస్యలను సాకుగా చూపి ఆమె శాఖను మార్చే అవకాశం ఉంది. వైయస్ విషయంలోనూ ఇతరత్రా ఏ విధమైన వివాదంలోకి చొరబడిన మంత్రి గీతారెడ్డి పట్ల అధిష్టానం సానుకూలంగా ఉంది. పైగా, ఆమె దళిత సామాజికవర్గం, తెలంగాణ ప్రాంతం సానుకూలాంశంగా ఉంది. ఇటీవలి కాలంలో అధిష్టానం వద్ద ఆమె ప్రాబల్యం పెరిగింది. దీంతో ఆమెకు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇచ్చి హోం శాఖను అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా, సీనియర్లు పలువురు రోశయ్య మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్ది చూపునకు ఆనని కుందూరు జానారెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, పి. శంకరరావు, డిఎల్ రవీంద్రారెడ్డి వంటి పలువురు సీనియర్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మొత్తం మీద, రోశయ్య మంత్రివర్గంలో మార్పులు భారీగానే ఉంటాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications