రాణా, శ్రియలను విడదీసిన బిపాసా?
తమ మధ్య గల సంబంధంపై రాణా గానీ శ్రియా గానీ ఓ రోజు కూడా బహిరంగ పరచలేదు. అయితే వారి మధ్య సంబంధం గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు వారిద్దరి మధ్య సంబంధం తెగిపోయిందని అంటున్నారు. శ్రియా ఇంకా రాణా కుటుంబ సభ్యులకు సన్నిహితంగానే మెలుగుతోంది. కానీ రాణా, శ్రియా మాత్రం దాని గురించి ఇప్పటి వరకు ఏమీ మాట్లాడుకోలేదని చెబుతున్నారు.
రాణాతో సంబంధాలపై వస్తున్న వార్తలపై బిపాసా బసు ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తనకు కొంత సమయం ఇచ్చి గౌరవించాలని ఆమె అంటోంది. రాణా బాలీవుడ్కు కొత్తవాడని, బచ్చే ్యే హాసీనోలో రణబీర్ కపూర్ మాదిరిగా, ఆ దేఖే జరాలో నీల్ నితిన్ ముఖేష్ మాదిరిగా తనకు దమ్ మారో దమ్లో రాణా అని ఆమె అంటోంది. కొత్తవారు ఇబ్బందికి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా మాత్రమే రాణాతో తనకు సంబంధమని ఆమె అంటోంది. నీల్, రణబీర్లతో కూడా తన స్నేహం ఉందని, అలాగే రాణాను ఎందుకు అనుకోరని ఆమె అంటోంది.