భానుమతి రాజకీయ కోణం?
సూరి హత్య వెనక వైయస్ జగన్ పాత్ర ఉందనే రీతిలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తాకథనం రావడంతో గంగుల భానుమతి దానికి వ్యతిరేకంగా కేసును మలుపు తిప్పేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అందుకే సూరి హత్యతో జగన్ బంధువులకు, మంగలి కృష్ణకు సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆమె ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ, పరిటాల కుమారుడు శ్రీరాములులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ పరిటాల రవి అనుచరుడనే విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల ఫాక్షన్ రంగును భానుమతి సూరి హత్యకు పులుముతున్నారు.
అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషించేందుకు గంగుల భానుమతి పునాదులు ఏర్పరచుకోవడంలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఈ స్థితిలోనే తన భర్త హత్యకు ఆమె రాజకీయ మలుపు ఇచ్చారని చెబుతున్నారు.