Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ స్థానంలో తల్లి విజయమ్మ?

YS Vijayamma-YS Jagan
హైకోర్టు, సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమ నేత వైయస్ జగన్ భవిష్యత్తుపై వైయస్సార్ కాంగ్రెసులో ఆందోళన చోటు చేసుకున్నట్లు అర్థమవుతోంది. వారి ప్రకటనలు చూస్తుంటే అలాగే అనిపిస్తోది. జగన్ వర్గానికి చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విలేకరులతో చేసిన వ్యాఖ్యలు వారు అనుమానంతో ఉన్నారనేందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి కొన్ని రోజులు కష్టాలు వచ్చినా వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. ఒకవేళ జగన్ కొన్ని రోజులు ప్రజల్లో లేని పరిస్థితులు ఎదురైనప్పటికీ పార్టీకి నష్టం జరగదని చెప్పారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే విజయమ్మ పార్టీకి సారథ్యం వహిస్తారని చెప్పారు. జగన్‌కు ప్రజల మద్దతు ఉందని చెప్పారు. ముందు ముందు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

జగన్ కొన్ని రోజులు ప్రజల్లో లేని పరిస్థితి వచ్చినా విజయమ్మ పార్టీకి సారథ్యం వహిస్తారని మేకపాటి చెప్పడం ఇప్పుడు చర్చానీయాంశం అయింది. జగన్‌పై సిబిఐ విచారణ ప్రారంభం అయినప్పటి నుండి వైయస్సార్సీ పార్టీ పూర్తి నిరాశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సిబిఐ ప్రాథమిక దర్యాఫ్తులో జగన్ కంపెనీలలోకి అక్రమంగా పెట్టుబడులు వచ్చాయని తేలి హైకోర్టు పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తే జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవని వైయస్సాఆర్సీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. జగన్ చిక్కుల్లో పడ్డారనే భావనలో జగన్ వర్గం కనిపిస్తోంది. గతంలో హైకోర్టు జగన్ ఆస్తులపై సిబిఐని ప్రాథమిక దర్యాఫ్తుకు ఆదేశించిన సమయంలోనూ ఆ పార్టీ అధికార ప్రతినిధు అంబటి రాంబాబు జగన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతూ ఒకవేళ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమాలు జరిగాయని తేలితే అందులో వైయస్ మంత్రివర్గం పాత్ర కూడా ఉంటుందని ఆరోపించారు.

అంబటి తన వ్యాఖ్యల ద్వారా జగన్ కంపెనీలలో అక్రమాలు జరగలేదని ఖచ్చితంగా ఖండించలేక పోయనట్టుగానే ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. జగన్ తీరు కూడా అక్రమాలకు అనుమానాలు తావిచ్చే విధంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించిన జగన్ శంకర్ రావు పిటిషన్‌పై హైకోర్టు ప్రాథమిక దర్యాఫ్తునకు ఆదేశించగానే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన ఆస్తులపై ప్రాథమిక విచారణ నిలిపి వేయాలని కోరారు. అయితే అందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిర్దోషి అని తేలితే మీకే లాభం కదా అని చెప్పింది. ఎలాంటి అక్రమాలకు పాల్పడక పోతే సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటని కాంగ్రెసు, టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+