జగన్ మాటలను వక్రీకరించారా?
"గాలిని అరెస్టు చేసిన విషయాన్ని నన్నెందుకు అడుగుతున్నారు. గాలి అరెస్టయితే పెళ్లి ఆయననో, బిజెపివాళ్లతోనో కర్ణాటకలో ఎవరితోనైనా మాట్లాడండి. అంతేగానీ ఆ పరిణామంతో నాకేం సంబంధం.." అని మాత్రమే అన్నట్లు ఆ పత్రిక రాసింది. దీన్ని వక్రీకరించారంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలపై సాక్షి దినపత్రిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లో కూటమిలోని ఆంధ్రజ్యోతిని తోక పత్రికగా సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. గాలి ఎవరో తనకు తెలియనే తెలియదన్న జగన్ అంటూ ఆ పత్రిక రాయడాన్ని తప్పు పట్టింది. కాంగ్రెసులోకి వెళ్లడమనేది అసంభవమని, అది జరగని పని అని జగన్ సిఎన్ఎన్ - ఐబిఎన్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నట్లు సాక్షి స్పష్టం చేసింది. జగన్ ఇంటర్వ్యూలోని కొంత భాగాన్ని సాక్షి దినపత్రిక ఇచ్చింది. ఈనాడు వార్తాకథనాన్ని కూడా సాక్షి తప్పు పట్టింది.
ఆ రెండు పత్రికలపై సాక్షి దినపత్రిక దుమ్మెత్తిపోస్తూ పెద్ద వార్తాకథానాన్నే ప్రచురించింది. మీడియా రెండుగా విడిపోయిన స్థితిలో రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చింది. సాక్షి దినపత్రిక వచ్చిన తర్వాత రాష్ట్రంలో మీడియా వార్ ఊపందకుంది. జీవించి ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆ రెండు దినపత్రికలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు. అదే సంప్రదాయాన్ని వైయస్ జగన్ కూడా కొనసాగిస్తున్నారు. ఢిల్లీ నాయకులను జగన్ కలిసినా దుష్ప్రచారమే సాగిస్తున్నాయని తనకు వ్యతిరేకమైన మీడియాను సాక్షి దుయ్యబట్టింది.