జగన్పై విచారణ కిరణ్కు వరం

వైయస్సార్ ప్రభుత్వ హయాంలోని నిర్ణయాల్లో తనకు ఏ విధమైన ప్రమేయం లేకపోవడం తనకు వరంగా మారినట్లు కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తన సహాయం కోసం చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు వస్తారని, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులు ప్రాంతాలవారీగా విడిపోవడాన్ని కూడా కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై దర్యాప్తు పనికి వస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం కాంగ్రెసు నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ, సీమాంధ్ర, జగన్ విధేయులుగా విడిపోయారు దాంతో గత 26 నెలలుగా కాంగ్రెసు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కుంటోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్యను దింపి కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టాల్సి వచ్చింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. సిబిఐ విచారణతో జగన్ విధేయులు కూడా వెనక్కి వస్తారని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications