చిరంజీవికి కిరణ్ కుమార్ రెడ్డి షాక్

Kiran Kumar Reddy
కాంగ్రెసు తాజా నాయకుడు చిరంజీవి ఆశలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నీళ్లు చల్లారు. 108 సేవలను సొంతం చేసుకుని ప్రచారానికి వాడుకోవాలని చిరంజీవి ప్రయత్నాలకు ఆయన గండి కొట్టారు. 108 సేవలను సొంతం చేసుకుని వాహనాలపై తన ఫొటోను చిత్రించి, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా తన పేరు రాజకీయాల్లో మారుమోగిపోయేలా చేసుకోవాలని చిరంజీవి భావించారు. 108 సేవలను తనకు అప్పగించాలని ఆయన కోరుతూ వచ్చారు. తనకు అప్పగిస్తే 108 సేవలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగా కూడా చెప్పారు. అయితే, చిరంజీవి ఆ సేవలను అప్పగించడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టంగా లేరని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులను నిర్వహిస్తున్న చిరంజీవి 108 సేవలను నిర్వహించడం తనకు కష్టం కాదని చెబుతూ వచ్చినట్లు సమాచారం. అయితే, తిరిగి జివికెకే ఆ సేవలను అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటికి డబ్బులు చెల్లించకపోవడంతో సేవలు ఆగిపోయాయి కూడా. ఈలోగానే 108 సేవల సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన వల్ల సమయానికి వాహనం రాకపోవడంతో, సకాలంలో వైద్యం అందక రాష్ట్రంలో ఇద్దరు మరణించారు కూడా. అయితే, 108 సేవలను ప్రభుత్వం నిర్వహించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. జివికెకు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు.

108 సేవలను జివికెకు అప్పగించే ఒప్పందం ఇరు పక్షాల మధ్య కుదిరింది. ప్రభుత్వం, జివికె మధ్య ఒప్పందం కుదరడంతో చిరంజీవికి వాటి నిర్వహణ బాధ్యత అప్పగించే అవకాశం లేదని అర్థమవుతోంది. ఇటీవల చిరంజీవికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి పనిచేయడానికి చిరంజీవి ఉద్యుక్తుడు కావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి దూరమైనట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+