రాములమ్మకు గుట్కా కష్టాలు
మత్తు పదార్థాల కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బ తిన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు ప్రచారంలో ఉంది. ఈ అనారోగ్యం కారణంగా పార్టీ సమావేశాలకు కూడా తరుచుగా డుమ్మా కొడుతూ ఉండేదని చెబుతున్నారు. ఇటీవల ఆమె లోకసభలో జై తెలంగాణ నినాదాలు చేయడంతో గొంతు ఇబ్బంది కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె విశ్రాంతి తీసుకుంటోందని సమాచారం. ఆమెకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పి, వాటిని అమలు చేయిస్తున్నారట.
అన్నాచెల్లెళ్లు కెసిఆర్, రాములమ్మ ఇటీవల లోకసభలో తెలంగాణపై లొల్లి పెట్టారు. ఆ లొల్లిని వారు అలాగే కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారు మూడో రోజు లోకసభకు వెళ్లడం మానేసి హైదరాబాదు తిరిగి వచ్చేశారు. కాంగ్రెసు పార్టీ చెప్పిన మాటలకు వెనక్కి తగ్గి వారు హైదరాబాదు వచ్చేశారని తెలంగాణవాదులు వారిపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.