వైఎస్ కుటుంబం కత్తులతోనే పుట్టింది

వారికి అధికారమే పరమావధి అని, అధికారానికి ఎవరు అడ్డు వచ్చినా చంపడమే వారి పని అన్నారు. మా కుటుంబానికి ప్రాణభయం ఉందని చెప్పారు. హత్యల విషయంలో మా కుటుంబ సభ్యులకి ఇప్పటికీ పెరోల్ దొరకలేదని చెప్పారు. మా తమ్ముడు ఉమామహేశ్వర్ రెడ్డి, పరిటాల రవి హత్య కేసులో వైఎస్ కుటుంబం హస్తం ఉందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు.
మా తమ్ముడు, పరిటాల హత్య కేసును ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి దమ్ముంటే పునర్విచారణ జరిపించాలని అన్నారు. అయితే కిరణ్కు అంత దమ్ముందా అనే అనుమానం వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య కేసుల అనంతరం మొద్దు శీను డైలాగులకు మంగలి కృష్ణదే స్ర్కీన్ప్లే అన్నారు. ఆ మంగలి కృష్ణే మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్కు రైట్ హ్యాండ్ అన్నారు.
సూట్కేసు బాంబు కుట్రలో జగన్ రైట్ హ్యాండ్ కృష్ణకు సంబంధం ఉందనే అనుమానం వెలిబుచ్చారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా నిజాన్ని అబద్దం చేయగలరు, అబద్దాన్ని నిజం చేయగలరన్నారు. సూట్ కేసు బాంబు కేసులో జగన్ను, కృష్ణను విచారించాలన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో కూడా వారి హ్యాండ్ ఉండి ఉంటుందన్నారు. సూరిని హత్య చేసిన భానును కూడా చంపి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో పరిటాల హత్యలో వైఎస్ కుటుంబానిది, మంగళి కృష్ణది ఉన్నది కూడా అంతే నిజమని చెప్పారు.
వైఎస్ కుటుంబానికి వ్యక్తులను వాడుకోవడం, ఆ తర్వాత వారి అవసరం తీరాక చంపివేయడం అలవాటేనన్నారు. సూరిని భాను ఒక్కడే హత్య చేయలేడన్నారు. అయితే కొన్ని హత్యలపై కిరణ్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నేనే ప్రైవేటు పిటిషన్ వేస్తానని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రిని త్వరలో కలుస్తానన్నారు. దగ్గరకు తీయడం, వారితో చంపించడం, తిరిగి వారినే చంపడం ఇదే వైఎస్ కుటుంబానికి తెలుసునన్నారు. వైఎస్ జగన్కు దమ్ముంటే గన్మెన్ లేకుండా కడప జిల్లాలో తిరగాలని ఆయన సవాల్ విసిరారు. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు తనకు సెక్యూరిటీ తగ్గింపు విషయాన్ని అడిగి పెంచమని విజ్ఞప్తి చేశాను.
అప్పుడు కొందరు అధికారులు జానారెడ్డికి విజ్ఞప్తి చేయడం వైఎస్కు దగ్గరివాడైన జానారెడ్డిని నమ్మకోవడం పట్ల నవ్వుకున్నారన్నారు. వైఎస్ మాట తప్పని, మడమ తిప్పని మనిషినని చెప్పుకున్నాడని, అయితే ఆయన జీవితమంతా మాట తప్పడం, మడప తిప్పడమేనన్నారు. జిల్లాలో వైఎస్ కుటుంబం ఎందరినో అణగదొక్కిందన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా అణగదొక్కిందన్నారు. కేవలం తనవారనుకున్న మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి వంటి వారిని తప్ప వారిని నమ్మిన వారందరికీ వైఎస్ కుటుంబం అన్యాయం చేసిందన్నారు. డిఎల్ను ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారన్నారు.
ఎమ్మెల్యే వీరశివారెడ్డిని చపరాసిలా చూశారన్నారు. వైఎస్ కుటుంబం గానీ, వైఎస్గానీ మాట మీద ఎప్పుడూ నిలబడలేదన్నారు. కరుణాకరరెడ్డి, బ్రదర్ అనీల్ కుమార్, అంబటి రాంబాబు, వైఎస్ వివేకానందరెడ్డిలు మాత్రమే లాభపడ్డారన్నారు. మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలతోనే విడిపోయారన్నారు. వివేకా పక్కా వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారనే అనుమానం పార్థసారధిరెడ్డి వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని నమ్మించడనికే ఉన్నారన్నారు. వారిది వ్యతిరేకులను నష్టపెట్టే వ్యూహం అన్నారు. వారి విభేదాలు పక్కా ప్రణాళికాతోనే జరుగుతున్నాయన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications