జగన్ వర్గంలో చీలిక, ఐదుగురు వెనక్కి?
కాంగ్రెసు నేతలు బుజ్జగించినప్పటికీ, ఇటీవల జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసులు వేగవంతమయ్యాయనే చెప్పవచ్చు. ఈ కేసుల విచారణ ఎంత వేగంగా ఉందో, అంతే వేగంగా అరెస్టుల పర్వం వరుసగా కొనసాగుతోంది. ఇప్పటికే కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయ రాఘవన్, సునీల్ రెడ్డి వంటి వారు అరెస్టయ్యారు. విజయ సాయి రెడ్డి, సునీల్ రెడ్డిలు జగన్కు అత్య సన్నిహితులు. ఈ నేపథ్యంలో జగన్ ఇబ్బందులకు గురైతే తమ భవిష్యత్తు ఏమిటనే సంశయం వారిలో కలిగి ఉండవచ్చునని అందుకే వారు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. జగన్కు ఇబ్బందులు ఎదురైతే టిక్కెట్ల పర్వం నుండి ప్రచారం వరకు అన్ని ఇబ్బందులే ఎదురవుతాయి. అంతేకాకుండా మరో రెండేళ్లకు పైగా శాసనసభ్యత్వం ఉంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్తో వెళ్లడం కన్నా కాంగ్రెసులో ఉండటమే బెటర్ అని భావిస్తున్న ఐదుగురు ఎమ్మెల్యేల వరకు యు-టర్న్ తీసుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో అవిశ్వాసం సమయంలోనూ జగన్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారని, ఆయన ఎమ్మెల్యేలు సింగిల్ డిజిట్కే పరిమితమౌతారనే వార్తలు జోరుగా వినిపించినప్పటికీ ఆ తర్వాత 17 మంది విప్ ధిక్కరించారు. ఈ కారణంగా విచారణ పూర్తయ్యాక కానీ ఖచ్చితంగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.