పేలుడు వల్లే తమిళనాడు ఎక్స్ప్రెస్లో ప్రమాదం?

ప్రమాదానికి ముందు ఎస్-11 బోగీలో మూడుసార్లు పేలుడు శబ్దాలు విన్నామని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని వారు అంటున్నారు. ఆ తర్వాతే పొగ వ్యాపించిందంటున్నారు. పుకార్లు నమ్మవద్దని పోలీసులు, రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ప్రత్యక్ష సాక్ష్యుల కథనం మాత్రం పేలుడు జరిగినట్లుగా ఉండటం గమనార్హం. అదే బోగీలో ప్రమాదం నుండి బయటపడ్డ వారు కూడా తాము 40-44 బెర్తుల మధ్య బాణసంచా పేలిన శబ్ధం విన్నామని రైల్వే పోలీసులకు చెప్పారు.
ప్రయాణీకులు తెలిపిన వివరాల ప్రకారం... పవర్ ఫెయిల్యూర్కు ముందే ప్రమాదం కోచ్ మొత్తం వ్యాపించిందని, వెంటనే కంపార్టుమెంట్ అంతా పొగ వ్యాపించిందని చెప్పారు. ప్రకాశ్ సింగ్ అనే 51 ఏళ్ల వ్యక్తి తాను 33వ బెర్తులో పడుకొని ఉండగా.. ట్యూబ్ లైట్ పేలిన శబ్ధం వినిపించిందని, దాంతో తాను తన బెర్త్ నుండి కిందకు దూకానని, తన పైన కొందరు ప్రయాణీకులు దూకారని చెప్పాడు.
అయితే ఇప్పటి వరకు అధికారులు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పలేక పోతున్నారు. విచారణ తర్వాతనే ఏదైనా చెబుతామంటున్నారు. మంగళవారం ఉదయం బోగీని ఫోరెనిక్స్ బోగీని పరిశీలించారు. నమూనాలు సేకరించారు. వీరు నివేదికను రైల్వే శాఖకు ఇవ్వనున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications