పెరుగుతున్న గళం: ధోనీ కెప్టెన్సీకి ముప్పు?

టీమిండియా కెప్టెన్ ధోనీపై ఒత్తిడి తగ్గించడం కోసం టెస్టు జట్టు పగ్గాలు మరొకరి అప్పగించాలన్న డిమాండ్లు త్వరలో నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. ధోనీ కెప్టెన్సీ భవితవ్యం సెలెక్టర్ల పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ధోనీకి ఈ మేరకు హెచ్చరికలు పంపినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ పరాజయం అనంతరం ధోనీ సారథ్యం పట్ల సెలెక్టర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెప్పారు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్కు ధోనీ కెప్టెన్గా కొనసాగాలంటే, పాక్తో జరుగుతున్న టి-20, వన్డే సిరీస్లో మెరుగైన ఫలితాలు సాధించాలని సెలెక్టర్లు స్పష్టమైన సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఇక 2015లో జరగబోయే వన్డే ప్రపంచ కప్లో టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రణాళికలను సిద్ధంగా చేయాల్సిందిగా మహేంద్ర సింగ్ ధోనీకి ఆదేశాలు పంపినట్టు సమాచారం.
నేరుగా అన్ని ఫార్మాట్ల నుంచి తొలగించకుండా మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు సూత్రాన్ని అమలులోకి తెచ్చినా ఆశ్చర్యం లేదు. విరాట్ కోహ్లీ, సురేష్ రైనా పేర్లు పరిమిత ఓవర్ల క్రికెట్కు వినిపిస్తున్నాయి. వచ్చే ప్రపంచ కప్ పోటీలకు జట్టు కూర్పుపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మెరుగైన ఆటగాళ్లను చూసుకోవాల్సి ఉంటుంది. వరుస వైఫల్యాలతో కూడా జట్టులో కొసాగుతున్న వారికి స్వస్తి చెప్పక తప్పదేమో..
కెప్టెన్గా ధోనీ బాగా అలసిపోయాడని, అతనికి కొంతకాలం విశ్రాంతి అవసరమని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ విరామంలో యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఛాన్సిస్తే జ ట్టులో నూతనోత్తేజం నింపుతాడన్నాడు. 'ధోనీ మూడు ఫార్మాట్లనుంచీ తాత్కాలికంగా తప్పుకొని విశ్రాంతి తీసుకోవాలి. 2015 వరల్డ్కప్ ఇంకా చాలా దూరముంది కాబట్టి దానిగురించి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇప్పటికిప్పుడు సిరీస్ మధ్యలో కాకున్నా..2013లో ఆస్ట్రేలియా సిరీస్కు ముందో లేదా తర్వాతో ధోనీ తప్పుకుంటే మంచిది. విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగిస్తే జట్టుకు యువోత్సాహం వస్తుంది' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్తో గ్లోబల్ స్టార్గా..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్












Click it and Unblock the Notifications