జగన్పై తెరాస వైఖరి మార్పు వెనక?

కెసిఆర్ తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు తన గొంతు విప్పారు. పార్లమెంటులో సమైక్యవాద ప్లకార్డును ప్రదర్శించిన జగన్ మళ్లీ పార్లమెంటులో తెలంగాణవాణిని వినిపించాల్సిందేనని, అప్పటి వరకు తాము జగన్ను నమ్మబోమని చెప్పారు. జగన్ను తెలంగాణలో అడ్డుకుంటామని కూడా తెరాస నాయకులు కొందరు చెప్పారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను చూసినట్లే తాము జగన్ను సమైక్యవాదిగా చూస్తున్నామని వారు స్పష్టం చేశారు. దీని వెనక మతలబు ఏమిటనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన నేపథ్యంలో తెరాస నాయకులు మాట మార్చారనే వాదన వినిపిస్తోంది. అయితే, దాని కన్నా ఎక్కువగా జగన్తో కుమ్మక్కయినట్లు జరిగిన ప్రచారం తమకు ఎక్కువ నష్టం చేకూర్చే విధంగా ఉందనే గ్రహింపునకు వారు వచ్చినట్లు కనిపిస్తోంది.
వైయస్ జగన్కు కెసిఆర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం తెలంగాణలో మొదటి నుంచీ ఉంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ప్రచారానికి బలం చేకూరే పరిస్థితి ఏర్పడింది. ప్రజల మనోభావాలకు భిన్నంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కూడా బలపడే పరిస్థితి వచ్చింది. దీంతో తెరాస నాయకులు మాట మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జగన్ రైతు దీక్ష పరిణామాలు ఎలా ఉంటాయనే విషయం ఆసక్తికరంగా మారింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications