కేసుపై బాబు భరద్వాజ్ను కలిశారా?

చంద్రబాబు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కలిసినట్లు ఆరోపణలు చేసి సాక్షి దినపత్రిక పెద్ద దుమారాన్నే రేపింది. తాజాగా, భరద్వాజ్ కలిసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. కాంగ్రెసుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తుండగా, చంద్రబాబుకే కాంగ్రెసు చెలిమిని అంటగట్టే ప్రయత్నంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది. అందులో భాగంగానే - రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతామని చంద్రబాబు, రామోజీ రావు ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చిటన్లు కొణతాల రామకృష్ణ, వాసిరెడ్డి ఆరోపించారు. నష్టాల్లో ఉన్న తెలుగేతర ఈటీవి చానెళ్లను రిలయన్స్ కొనుగోలు చేయడంలో మతలబు ఉందని, చంద్రబాబు సూచన మేరకే రిలయన్స్ రామోజీ టీవీ చానెళ్లను కొనుగోలు చేసిందని వారన్నారు.
మొత్తం మీద, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య రాజకీయ పోరాటమే కాకుండా న్యాయపరమైన పోరాటంలో పరస్పరం పైచేయి సాధించే వ్యూహాల అమలు కూడా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications