వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్‌ల వెనుక జగన్, మాజీ సలహాదారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కావొచ్చుననే అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. సిబిఐ దర్యాఫ్తును తప్పు పడుతూ రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. శనివారం వారు మీడియాతో కూడా మాట్లాడుతూ, సిబిఐ తీరును ఎండగట్టారు. విచారణ పేరుతో అధికారులను వేధిస్తున్నారని, పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను పట్టుకుంటున్నారని ఆరోపించారు. అయితే వీరి వెనుక జగన్ ఉండవచ్చుననే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నాటి సలహాదారు, పలువురు మంత్రుల హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో రాజకీయ కోణం ఉందని కేంద్ర నిఘా వర్గాలు అనుమానించాయట. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నాటి ప్రభుత్వం చెప్పిన దానికి తలూపిన కొద్దిమంది అధికారులు తాము బయటపడేందుకు మిగిలిన అధికారులతో కలిసి ప్రభుత్వంపై పరోక్ష యుద్ధం ప్రకటించారని, దీనిని తెరవెనుక జగన్, నాటి సలహాదారే ఉండి నడిపిస్తున్నారని అంటున్నారు. మంత్రులను వదిలి తమను వేధిస్తున్నారని ఐఏఎస్‌లు విమర్శించడాన్ని బట్టి చూస్తుంటే ఇందులో రాజకీయ కోణం ఉందని గట్టిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సిబిఐ ఎదుట హాజరైన సమయంలో తన పేరు చెబితే అసలుకే ఎసరు వస్తుందన్న ముందస్తు వ్యూహంతో నాటి సలహాదారు వీరిని ప్రధానంగా రంగంలోకి దించి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్టైలిష్ హోం రంగారావు ఆయన పాత్రను సిబిఐ ఎదుట వెల్లడించారు. ఇలాంటి సమయంలో మరికొందరు ఐఏఎస్‌లు నోరు విప్పక ముందే ప్రభుత్వంపై ఎదురు దాడికి ఐఏఎస్‌లకు రంగంలోకి ఆయన దింపి ఉంటారని అంటున్నారు. ఈ వ్యవహారంతో సిబిఐ, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విచారణలో వేగం తగ్గడం ద్వారా తాము బయటపడవచ్చునని వారు భావిస్తున్నారట. అయితే ఆయన జగన్‌తో కలిసి చేస్తున్నారా లేక వేరుగా చేస్తున్నారా అనే అంశం తేలడం లేదట. ఇందులో రాజకీయ కోణం దాగి ఉండటం వల్లనే పలువురు ఐఏఎస్‌లు సిఎంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చేందుకు ముందుకు రాలేదని అంటున్నారు. శుక్రవారం సిఎంకు ఐఏఎస్ అధికారులు ఫిర్యాదు చేయగానే కేంద్ర ఇంటలిజెన్స్ రంగంలోకి దిగి దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశాన్ని ఆరా తీసిందట.

అవసరమైతే వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని కొందరు అధికారులు వ్యాఖ్యానించడం, మంత్రులను విడిచిపెట్టి తమను వేధించడం ఏమిటని నిలదీసిన వైనం గమనించిన నిఘావర్గాలు ఆ దిశగా ఆరా తీశాయట. జగన్‌తో పాటు, సలహాదారు ఉన్నారని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు నివేదిక కూడా ఇచ్చాయట. అదే సమయంలో వైయస్ హయాంలోని కొందరు మంత్రుల హస్తం కూడా ఇందులో ఉందని తేలిందని సమాచారం. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడంతో పాటు, ప్రభుత్వానికి - అధికారులకు దూరం పెంచి రానున్న ఎన్నికల్లో కాంగ్రెసును దెబ్బతీసేందుకే జగన్ ఈ పథకం రచించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో రాజకీయ కోణం ఉండటం వల్లనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి వాదనకు మద్దతివ్వలేదనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

English summary
The allegations came out that YSR Congress Party chief YS Jaganmohan Reddy behind IAS officers unhappy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X