రూలర్: జగన్కు 'సింహాసన' యోగం లేదా?
అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి బయటకు రావడమే కాకుండా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తారని జగన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రవణంలో పండితులు చెప్పారు. జగన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అత్యధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని కేంద్రంలోను కీలకంగా మారుతారని చెప్పారు.
కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారముందని చెప్పారు. అయితే, జగన్ పార్టీ కార్యాలయంలో రామచంద్ర శాస్త్రి చెప్పిన శ్రవణానికి ఇతరులు చెప్పిన దానికి భిన్నంగా ఉంది. జగన్ కింగ్ అయ్యే పరిస్థితి లేదని, కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు.
జగన్ పార్టీ కార్యాలయంలో శ్రవణం వినిపించిన శాస్త్రి 230 సీట్లు వస్తాయని చెబితే.. మరికొందరు మాత్రం 60-70 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నారు. లోకసభ ఎన్నికల్లోను 12-18 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నారు. జగన్కు సింహాసన యోగం లేదని, అధికారం కోసం ఆయన ఫైట్ చేయక తప్పదని మరికొందరు శాస్త్రులు చెబుతున్నారు. రూలర్ అయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు.