ఏపీలో ఆకాశహర్మ్యాల్లో పేదలు: చంద్రబాబు ప్లాన్
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతితోపాటు ఏపీలో పేదల ప్రజల కోసం ఆకాశహర్మ్యాలు రానున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక శైలిలో గృహ నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రయివేటు నిర్మాణ సంస్థలు ముందుకు రావాలని సూచించారు.
సామాన్యులు సైతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అ్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణం మురికివాడలను ప్రోత్సహించేదిగా కాకుండా ఆర్థిక లావాదేవీలు పెంచేందుకు దోహదపడేలా ఉంటుందన్నారు.
సోమవారం సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధులతో ఆయన విజయవాడలోని విడిది కార్యాలయంలో భేటీ అయ్యారు. నవ్యాంధ్ర నిర్మాణాన్ని చంద్రబాబు భుజానికి ఎత్తుకున్నారని సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధులు ప్రశంసించారు.

ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తాము పేదలకు అందుబాటులో ఉండే గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చామని చెప్పారు. తమకు నాలుగు రాష్ట్రాల్లో లక్షల ప్లాట్లు నిర్మించిన అనుభవం ఉందని చెప్పారు. నవ్యాంధ్రలో పేదలకు సకల సదుపాయాలతో ఇళ్లను నిర్మిస్తామన్నారు.
కాగా, ఏపీ రాజధాని అమరావతిని సియోల్, యూకేల స్ఫూర్తిగా హౌస్ మీడియా హబ్గా మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో... ప్రభుత్వ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీలతో పాటు మీడియా-కల్చరల్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో మొత్తం 9 'సిటీ'లు ఏర్పాటు చేయనున్నారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications