కొత్త పెన్షన్ల మంజూరు పై ప్రభుత్వం కీలక ప్రకటన - ఈ సారి వీరికే, పంపిణీ ముహూర్తం..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్లు.. ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న వారికి తీపి కబురు అందించింది. ఇప్పటికే వీటి కోసం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. కాగా, బడ్జెట్ లో ఇప్పటి కే ప్రకటించిన రెండు లక్షల పెన్షన్ల తో పాటుగా రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. దరఖాస్తులు.. అర్హతల పైనా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వీటికి సంబంధించి మరో ముఖ్య నిర్ణయంతో ముందుకు వెళ్తోంది.

తెలంగాణలో కొత్త పెన్షన్లు.. ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2వ తేదీ నుంచి రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ ప్రకటించారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నూతనంగా 2లక్షల మందికి పింఛన్లు మంజూరు కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, వేగవంతంగా దిగుమతులు చేయించేందుకు అధికారులు, మిల్లర్లను సమన్వయం చేస్తూ చర్యలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా పూర్తయి గృహ ప్రవేశాలు అవుతున్నాయని వివరించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ జూన్‌లో ప్రారంభవుతుందని ఆయన తెలిపారు.

శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్, అలిపిరి వద్ద అందుబాటులోకి కొత్తగా- ఇక ఆ అవసరం లేదు..!!
శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్, అలిపిరి వద్ద అందుబాటులోకి కొత్తగా- ఇక ఆ అవసరం లేదు..!!
minister-vivek-venkataswamy-announced-that-the-state-government-will-officially-begin-distributing

జూన్ 2న కొత్త పెన్షన్లు పంపిణీ

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42 లక్షల మందికి పైగా చేయూత/ఆసరా పెన్షన్లు పొందుతు న్నారు. కొత్తగా 2 లక్షల మందికి ఆమోదం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పెన్షన్లకు నిధులు కేటాయించి, జూన్ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అది అంచనా మాత్రమే. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు వంటి వర్గాలకు ఈ చేయూత పెన్షన్ పథకం వర్తిస్తుంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు మొదలైనవారికి నెలకు రూ.2,016, దివ్యాంగుల కు రూ.4,016 ఇస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెన్షన్‌ని రూ.4,000కి పెంచుతామని హామీ ఇచ్చింది. అది ఇంకా అమలు కాలేదు. ఇప్పటివరకూ పెన్షన్ పొందకుండా, కొత్తగా పెన్షన్ పొందాలి అనుకునేవారు గ్రామ సభలు, ప్రజా వాణి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ కొత్త కార్డుల మంజూరు ప్రారంభించాలని నిర్ణయించారు. అదే విధంగా కొత్త రేషన్ కార్డుల ఆమోద ప్రక్రియ నిరంతరం కొనసాగించేందుకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+