వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీపై బిజెపి ఫిక్స్: సుష్మాపై ఒత్తిడి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు విషయంలో బిజెపి నాయకత్వం తీవ్రమైన ఒత్తిడికి గురువుతున్నట్లు కనిపిస్తోంది. చివరి నిమిషంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు బిజెపి అడ్డం తిరుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బిజెపి తెలంగాణ నాయకత్వమే కాకుండా రాష్ట్ర నాయకత్వం కూడా తీవ్రమైన చిక్కుల్లో పడింది. బిజెపి పరిస్థితి కరమంటే కప్పకు కోపం, వదలాలంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది.

తెలంగాణ బిల్లుకు సహకరించలేమని పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ, బిల్లును సభలో ప్రవేశపెట్టలేదని సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటనలతో బిజెపి రాష్ట్ర నాయకత్వం గందరగోళంలో పడింది. తన జాతీయ నాయకత్వం మనసు మార్చడానికి రంగంలోకి దిగింది.

బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో పాటు శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస రెడ్డి పార్టీ నాయకులు తమ పార్టీ అగ్రనేతలను కలిసి బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటన చేయాలని ఒత్తిడి తెచ్చారు. సుష్మా స్వరాజ్‌పై దీంతో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దీంతో ఆమె తెలంగాణకు మద్దతు ఇస్తామంటూ శుక్రవారం ప్రకటన చేశారు.

సుష్మాపై తెలంగాణ ఒత్తిడి

సుష్మాపై తెలంగాణ ఒత్తిడి

తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరడానికి బిజెపి రాష్ట్ర నాయకులు శుక్రవారం సుష్మా స్వరాజ్‌ను కలిశారు.

సుష్మాకు శుభాకాంక్షలు

సుష్మాకు శుభాకాంక్షలు

సుష్మా స్వరాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బిజెపి నాయకుడు ఇలా కనిపించారు.

స్పష్టం చేసిన కిషన్ రెడ్డి

స్పష్టం చేసిన కిషన్ రెడ్డి

తెలంగాణకు తమ పార్టీ మద్దతు ఇవ్వదేమోననే సందేహాలు ఏర్పడిన నేపథ్యంలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై తమ వైఖరి మారలేదని స్పష్టం చేశారు.

నాగం జనార్దన్ రెడ్డి ప్రతిజ్ఞ

నాగం జనార్దన్ రెడ్డి ప్రతిజ్ఞ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తానని బిజెపి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రతిజ్ఝ చేశారు. తమ పార్టీ తెలంగాణకు మద్దతు ఇవ్వడం లేదనే దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆయన విమర్శించారు.

కిషన్ రెడ్డి తీవ్ర యత్నం..

కిషన్ రెడ్డి తీవ్ర యత్నం..

తెలంగాణ బిల్లుపై సుష్మా స్వరాజ్ మనసు మార్చడానికి బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగానే కృషి చేశారు. తాము బిల్లుకు మద్దతు ఇస్తామని సుష్మా స్వరాజ్ ప్రకటించారు.

English summary
BJP Andhra Pradesh leaders met Sushama Swaraj to urge to support Telangana bill in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X