Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవి లీడ్: కిరణ్‌పై మంత్రుల తిరుగుబాటు

 Chiranjeevi leads: Rebellion brewing in Kiran Kumar cabinet
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యం చేసుకుని ఎనిమిది మంది సీమాంధ్ర మంత్రులు తిరుగుబాటు బావుటా ఎగురేసినట్లు కనిపిస్తోంది. ఈ తిరుగుబాటుకు కేంద్ర మంత్రి చిరంజీవి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని ప్రశ్నించడం తమకు అంగీకారయోగ్యం కాదంటూ వారు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో మంగళవారం సమావేశం జరిగిందని అంటున్నారు.

ఈ సమావేశానికి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, సి. రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్, మహీధర్ రెడ్డి, ఎన్ రఘువీరా రెడ్డి, పి. బాలరాజు హాజరయ్యారు. వీరందరి తరఫున ఆనం రామనారాయణ రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పరోక్షంగా ముఖ్యమంత్రి తీరును తప్పుపడుతూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. సిడబ్ల్యసి నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా చివరి వరకు సమైక్యాంధ్ర కోసం ఒత్తిడి తెస్తామని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ కాంగ్రెసు పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

విభజన తీర్మానాన్ని ఓడించి ఆపై రాజీనామాలకు సమిష్టిగా ముందుకెళ్లాలని కిరణ్ కుమార్ రెడ్డివర్గానికి చెందినవారు భావిస్తుంటే మరోవర్గం మాత్రం సేవ్‌ కాం గ్రెస్‌ సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో పార్టీలోనే కొనసాగే యోచన చేస్తు న్నారు. మొత్తం మీద సమైక్యంపేరుతో సాగుతున్న భేటీలు ముఖ్యమంత్రి అనుకూల, వ్యతిరేక మంత్రులు వర్గాలుగా ఏర్పాటుకు దోహదప డ్డాయని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ హైక మాండ్‌ను దిక్కరించేలా ఉన్నాయని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది కాంగ్రెస్‌ నేతలేనని చర్చకు వచ్చినట్లు సమా చారం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించేలా ఉండాలే గానీ సమస్యను మరింత జఠిలం చేసే విధంగా ఉండకూడదని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

అన్ని పార్టీల అభిప్రాయం మేరకే తెలంగాణ ఏర్పాటు దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ఇది ప్రజలకు చెప్పకుండా ప్రతిపక్షాల ఆరోపణలపై మౌనం దాల్చితేనిండా మునుగుతామని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై పార్టీ హైకమాండ్‌ గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే సీనియర్‌ మంత్రుల బృందం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రికి బాసటగా మరో వర్గం

ఇదిలావుంటే మరోవైపు మంత్రి గంటా శ్రీనివాస రావు నివాసంలో మంత్రి శైలజానాథ్‌, ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ తదితరులు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వారు సమర్థించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వారు అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+