ఘాటుగా గవర్నర్, చిరుపై అదే అభిమానం (పిక్చర్స్)
హైదరాబాద్: ఏపీ నుండి వచ్చే వాహనాల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు చేయడం వంటి వాటి పైన ఏపీ కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, పళ్లం రాజు తదితరులు సోమవారం గవర్నర్ నరసింహన్కు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్, కాంగ్రెస్ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి పట్ల గవర్నర్ స్పందనపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, వీటిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని, వాటిపై ఏమంటారని, మీరు మౌనంగా ఉంటే కాదని, విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై ఎలా స్పందించారో చెప్పాలని వారు గవర్నర్తో అన్నారు.
దీనిపై గవర్నర్ మాట్లాడుతూ... తాను చేసింది కరెక్టని, చట్టం ప్రకారమే వ్యవహరిస్తున్నానని, తాను వెళ్లిపోయాకైనా నేనే రైట్ అని మీకు తెలుస్తుందని కాంగ్రెస్ నేతలతో గవర్నర్ నరసింహన్ అన్నారు. పత్రికల్లో నాపై కథనాలు రాస్తున్నారని, నేను వెళ్లిపోయాకే నా విలువ తెలుస్తుందని, తెలుగు రాష్ట్రాలకు నేను ఎంత చేసిందీ ప్రజలకు తెలుసన్నారు.

చిరంజీవి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్ నేత చిరంజీవి వద్ద ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న చిన్నారులు.

చిరంజీవి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్ నేత చిరంజీవికి పూవులు ఇస్తున్న చిన్నారులు.

చిరంజీవి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్ నేత చిరంజీవికి పూవులు ఇస్తున్న చిన్నారులు.

కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం బయటకు వచ్చి మాట్లాడుతున్న చిరంజీవి, పళ్లం రాజు తదితరులు.

కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం బయటకు వచ్చి మాట్లాడుతున్న మాజీ కేంద్రమంత్రి పళ్లం రాజు.

కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం బయటకు వస్తున్న కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, పళ్లం రాజు తదితరులు.

కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం బయటకు వస్తున్న కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, పళ్లం రాజు తదితరులు.

కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిసిన అనంతరం బయటకు వస్తున్న కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, పళ్లం రాజు తదితరులు.

మెమోరాండం
ఏపీ నుండి వచ్చే వాహనాల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు చేయడం వంటి వాటి పైన ఏపీ కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, పళ్లం రాజు తదితరులు సోమవారం గవర్నర్ నరసింహన్కు మెమోరాండం ఇచ్చారు.












Click it and Unblock the Notifications