గోపీచంద్కు 'తెలంగాణ' షాక్: అలీకి సింధు కౌంటర్
హైదరాబాద్: ఏస్ షట్లర్ పీవీ సింధు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గోపీచంద్ మంచి కోచ్ అని ఆమె కితాబిచ్చారు. పీవీ సింధు రజతం గెలిచిన అనంతరం హైదరాబాదులో రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆమెను సన్మానించింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సింధు వచ్చే ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచేందుకు అంతర్జాతీయ కోచ్ను చూస్తున్నామని చెప్పారు. అనంతరం విమర్శలు రావడంతో తాము గోపీచంద్ను తప్పుపట్టలేదని వివరణ ఇచ్చారు.
గోపీచంద్కు షాక్పై అలీ వివరణ, సింధు పరిపూర్ణ క్రీడాకారిణి కాదన్న కోచ్
ఈ నేపథ్యంలో బుధవారం నాడు పవీ సింధు మాట్లాడారు. తాను కోచ్ గోపీచంద్ శిక్షణలోనే కొనసాగుతానని చెప్పారు. నా వరకు గోపీచంద్ చాలా మంచి కోచ్. అదే సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కామెంట్ చేసిన వ్యాఖ్యల పైన తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.
సన్మాన సభ సందర్భంగా మమూద్ అలీ మాట్లాడుతూ.. మన తెలంగాణ అమ్మాయి రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని, ఆమె మరింత ముందుగు సాగేందుకు తాము మంచి కోచ్ను నియమిస్తామని, ప్రస్తుతం ఉన్న గోపీచంద్ కూడా మంచి కోచ్ అని, కానీ అంతర్జాతీయ మ్యాచుల కోసం మంచి కోచ్న ఏర్పాటు చేస్తామని, అప్పుడు ఆమె గోల్డ్ మెడల్ సాధిస్తుందన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
సింధుకు కొత్త కోచ్: గోపీచంద్కు 'తెలంగాణ' షాక్, నేతల క్యూ(పిక్చర్స్)
ఏస్ షట్లర్ పీవీ సింధు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గోపీచంద్ మంచి కోచ్ అని ఆమె కితాబిచ్చారు. పీవీ సింధు రజతం గెలిచిన అనంతరం హైదరాబాదులో రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆమెను సన్మానించింది.