ఇంట్లో జగన్ దీక్ష, ఢిల్లీలో బాబు ఢీ: మైలేజ్ రాలేదా?
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేసి ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో చర్చనీయంగా మారారని చర్చించుకుంటున్నారట. ఇంట్లో దీక్ష చేసి వైయస్ జగన్ విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ ఇంటి ముందే దీక్ష చేయడం, దీక్షా శిబిరం నుండి కొన్ని గంటల పాటు అందుబాటులో లేకుండా పోయారనే ఆరోపణలు ఆ పార్టీకి అనుకున్నమైలేజ్ తీసుకు రాలేదంటున్నారు.
చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయడమే కాకుండా సీమాంధ్రుల సమస్యను జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారని చెబుతున్నారు. శుక్రవారం తన దీక్షను భగ్నం చేసినా చంద్రబాబు ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు నిరాకరించారు. శనివారం మధ్యాహ్నం వైద్యులు బలవంతంగా ప్లూయిడ్స్ ఇచ్చారు.
అదే సమయంలో లోపాయికారి ఒప్పందం ఆరోపణల నేపథ్యంలో జగన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన మొక్కుబడిగా విమర్సలు చేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు. బాబు దీక్షను భగ్నం చేశాక తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోనియా ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు.